twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం పని ఏవీయస్?

    By Staff
    |

    AVS
    ప్రముఖ కమిడియన్ ఏవీయస్..కి ఆ మధ్య కాలేయం ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు గ్లోబుల్ ఆస్పత్రిలో జరిగిన ఆ ఆపరేషన్ కి సహాయం అందించింది ఇద్దరుట. ఒకరు విసు కన్సల్ టెన్సీ అధినేత సి.సి.రెడ్డి, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి. సి.సి.రెడ్డిగారు కొంత వ్యక్తిగత సహాయం చేసి,దగ్గరుండి ఏవీయస్ ని తీసుకుని ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్ళి గవర్నమెంట్ తరుపున సహాయం అందించారు. అలాగే చిరంజీవి ఆ ఆపరేషన్ కి ఐదు లక్షలు రూపాయలు దాకా సహాయం అందించారు. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా ఏవీయస్ స్వయంగా మీడియాతో చెప్పారు.

    కానీ ఇప్పుడు ఏవీయస్...లోకం కోడై కూస్తోంది పేరుతో తెలుగు దేశం ప్రచార ప్రకటనలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రేస్ రాజశేఖర్ రెడ్డని,చిరంజీవిని విమర్శిస్తున్నాడు. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్ళను చూసాం కానీ ఇలా మాటిమాటికీ పార్టీలు మార్చి,తనకు సహాయం చేసే వారిని విమర్శిమంచేవాళ్ళను చూడలేదని కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంత స్పీడుగా సీన్ మారిస్తే ఎలా అంటున్నారు. కొందరైతై మిగతా పార్టీలు వాళ్ళు తమ పార్టీ ప్రచారం చేసే ఛాన్స్ అతనికివ్వలేదు. తెలుగుదేశం వారు ఆ అవకాశం ఇచ్చారు..కళాకారుడుగా ఎవరు అవకాశమిస్తే వారికి కొమ్ముకాయటం సహజమే కదా..అని వెనకేసుకొస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X