Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ప్రభాస్ సినిమా కోసం నెవర్ బిఫోర్ సెట్.. రూ.30కోట్లతో..
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏమిటో మరోసారి రాధేశ్యామ్ షూటింగ్ తో క్లియర్ గా అర్ధమయ్యింది. అలస్యమయినా కూడా ఈ సారి అభిమానుల అంచనాలకు తగ్గకుండా సినిమాను తేవాలని ప్రభాస్ టీమ్ బాగానే కష్టపడుతోంది. ఖర్చు విషయంలో అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ అయ్యింది. ఎదో వంద కోట్లతో ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా ఎండ్ అయ్యేవరకు లెక్క 200కోట్లు దాటేలా ఉంది.
పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు కావున అన్ని భాషల వారికి నచ్చేలా ఉండాలని దర్శక నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇటలీకి వెళ్లి ఇటీవల ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ బృందం త్వరలోనే హైదరాబాద్ లోనే మరో భారీ షెడ్యూల్ కి ప్లాన్ రెడీ చేసుకుంది. దాదాపు 30కోట్ల రూపాయలతో ఒక స్పెషల్ సెట్ ని రెడీ చేయనున్నారట.
అందులోనే సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆ సీన్స్ చాలా కీలకమని టాక్ వస్తోంది. అందుకే మొదట 20కోట్లతో పూర్తి చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు 30కోట్లకు ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. మరి ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.