Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
చిరంజీవి - త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్డేట్: చివరికిలా డిసైడ్ అయ్యారన్న మాట
మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎప్పటి నుంచో వేచి చూస్తున్న కాంబినేషన్లలో మెగాస్టార్ చిరంజీవి - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి. టాలీవుడ్లోనే టాప్ ప్లేస్లో ఉన్న వీళ్లిద్దరి కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడా ప్రాజెక్టు గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
రీఎంట్రీలో దూకుడు చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' మూవీ షూటింగ్ పూర్తవక ముందే మరిన్ని చిత్రాల్లో నటించేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాదు, 'లూసీఫర్', 'వేదాళం' రీమేక్లతో పాటు బాబీ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్తోనూ ఓ ప్రాజెక్టు చేయబోతున్నారట. తాజాగా దీని కోసం ఈ ఇద్దరూ భేటీ అయ్యారని ఓ న్యూస్ లీకైంది. ఆ సందర్భంలోనే చిరుకు ఓ లైన్ చెప్పాడట మాటల మాంత్రికుడు. అది ఆయనకు బాగా నచ్చడంతో వర్క్ చేయమని చెప్పాడట.
త్రివిక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయనున్నాడు. పొలిటికల్ బ్యాగ్డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీని తర్వాత ఆయన మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవితోనే చేయనున్నారని అంటున్నారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన మీటింగ్లో సైతం ఇదే విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోన్న కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.