Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కడప మేయర్ తో బాలకృష్ణ చిత్రం ఖరారు
కడప మేయర్ రవీంధ్ర నాధ్ రెడ్డి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం త్వరలో రూపొందనుందని సమాచారం. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ మేరకు బాలకృష్ణతో చర్చించి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ కొత్త రైటర్ చెప్పిన కథను ఓకే చేసిన నిర్మాత బాలయ్యను ఒప్పించారు. ఇక ఈ చిత్రాన్ని జయంత్ సి పరాంన్జీ దర్శకత్వంలో రూపొందించనున్నారు. గతంలో జయంత్ దర్సకత్వంలో లక్ష్మీ నరసింహా, అల్లరి పిడుగు చిత్రాలు వచ్చాయి. లక్ష్మీ నరసింహా చిత్రం మంచి విజయం సాధించగా, అల్లరి పిడుగు చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక బాలకృష్ణ తన తాజా చిత్రం శ్రీరామ రాజ్యం విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాపు దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం రేపు విడుదల కానుంది. అలాగే బాలకృష్ణ ..పరుచూరి మురళి దర్శకత్వంలో అధినాయకుడు చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రంలో తండ్రిగా, తాతగా, మనవడుగా కనపించనున్నారు. ఆ గెటప్స్ కు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. అధినాయకుడు అనంతరం ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది.