Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
RRR: విసిగిపోయిన రాజమౌళి, ఎన్టీఆర్కు ఈమెను సెట్ చేస్తున్నారా?
Recommended Video
'RRR' సినిమాలో నటించబోయే ప్రధాన తారాగణం గురించి అఫీషియల్ ప్రకటన చేసిన తర్వాత బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈవిడ ఎన్టీఆర్కు జోడీగా నటించాల్సి ఉండగా... పలు కారణాలతో ఆమె ఈ మూవీ నుంచి బయటకు వెళ్లారు.
ఓ వైపు షూటింగ్ మొదలైన నేపథ్యంలో రాజమౌళికి వెంటనే ఆమె స్థానంలో హీరోయిన్ను రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. షూటింగుకు 3 వారాలు బ్రేక్ ఇవ్వడానికి కారణం కేవలం రామ్ చరణ్ కాలి గాయం మాత్రమే కాదు, హీరోయిన్ ఎంపిక జరుగుగాల్సి ఉండటం కూడా ఓ కారణమని టాక్.
ఈ హీరోయిన్ను ఎన్టీఆర్కు జోడీగా?
బాలీవుడ్ నటి, ‘సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్ను RRR ప్రాజెక్టులోకి తీసుకునే ఆలోచన రాజమౌళి చేస్తున్నట్లు తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. డైసీ ఎడ్గర్ జోన్స్ స్థానంలో ఈవిడను ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
శ్రద్ధా కపూర్ డేట్స్ సాధ్యమేనా?
‘సాహో' మూవీ ద్వారా శ్రద్దా కపూర్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు. మరి ఉన్నట్టుండి ‘RRR' కోసం ఆమె డేట్స్ ఇవ్వగలదా? అనేది సందేహంగా మారింది. ప్రస్తుతం ఆమె హిందీలో చిచ్చోరే, స్ట్రీట్ డాన్సర్ చిత్రాల్లో నటిస్తోంది.
RRR టీమ్కు షాకుల మీద షాకులు
RRR టీమ్కు షాకుల మీద షాకులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ ఉన్నట్టుండి తప్పుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ కాలికి గాయం కావడంతో షూటింగ్ 3 వారాల పాటు వాయిదా వేశారు. చరణ్ గాయం నుంచి రికవరీ అయిన తర్వాత షూటింగ్ మొదలు కానుంది.
RRR
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామారాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. 1920 నాటి బ్రిటిష్ బ్యాక్డ్రాప్తో ఈ మూవీ తెరకెక్కబోతోంది.