Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'నటరత్న' దాసరి నారాయణరావు
మోహన్ బాబుకు, చిరంజీవికి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గమంటుందని వేరే చెప్పక్కర్లేదు. మొన్న తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో ఎవరు లెజెండ్ అన్న విషయంలో ప్రత్యక్షంగా యుద్ధానికి దిగటం, నిన్న స్టార్ నైట్ మీటింగ్ కు చాలా మంది రాలేదని విమర్శించిన మోహన్ బాబు ఎక్కడా చిరు పేరు ప్రస్తావించకున్నా, గుమ్మడికాయల దొంగెవరంటే బుజాలు తడుముకున్నట్టు చిరు దానికి చాలా ఘాటుగా జవాబివ్వడం తెలిసిందే. కానీ మోహన్ బాబు అలా మాట్లాడటానికి కారణం ఆయన వెనుకనున్న ఆయన గురువు దాసరి నారాయణరావేనని చాలా మంది చెప్పుకుంటున్నారు. చిరు ఇమేజ్ ను తగ్గించడానికే దాసరి పన్నాగం పన్ని, దాన్ని మోహన్ బాబు చేత అమలు చేయించాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.
కానీ నిన్న జరిగిన రామ్ చరణ్ మూడవ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరైన దాసరి ఎంతో ఉత్సాహంగా అందరితో మాట్లాడుతూ, చిరు కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఇది చూసిన వారంతా మోహన్ బాబుని చిరు పైకి ఉసిగొల్పిన దాసరి ఇప్పుడు చిరు కుటుంబంతో ఇంత సన్నిహితంగా మెలుగుతున్నారేంటి అని ఆశ్చర్యపోయారంట. కొందరైతే ఆయనలో గొప్ప నటుడు వున్నాడని, ఆయనకు దర్శకరత్న అన్న బిరుదు కంటే నటరత్న అన్న బిరుదైతే బాగుంటుందని చెప్పుకోవడం కనిపించింది.