దాసరి యంగ్ ఇండియా కాదు టార్చర్ ఆప్ ఇండియా అట!
దర్శకరత్న దాసరి నారాయణరావు తన 149వ చిత్రంగా కొత్త వాళ్ళను పరిచయం చేస్తూ 'యంగ్ ఇండియా" చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షోలను ఇటీవల దాసరి తన ఫ్రెండ్స్ కు, శ్రేయోభిలాషులకు ప్రెజెంట్ చేస్తున్నాడట. ఈ షోలను చూసిన వాళ్ళందరూ ఇది 'యంగ్ ఇండియా" కాదు. 'టార్చర్ ఆఫ్ ఇండియా" అని మాట్లాడుకుంటున్నారట.
ప్రస్తుత సమస్యలను ఈ సినిమాలో చర్చించినప్పటికి అవి కథలో సీన్లు చొప్పించినట్టు ఉన్నాయి కానీ..కథలో లీనం కాలేదు అనే టాక్ బయటికి వచ్చింది. మరి రేపు విడుదలవుతున్న ఈ సినిమాకి జనాలు ఎలాంటి మార్కులు వేస్తారో చూద్దాం.


Click it and Unblock the Notifications











