twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ, నితిన్, సాయి ధరమ్ తేజ్ క్లాష్.. చివరకు ఏం జరిగేనో!

    |

    మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరో నితిన్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఈ ముగ్గురికీ హిట్ అనేది కీలకం. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్న ఈ హీరోలు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేసి కెరీర్‌లో మరో మలుపు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే అనుకోకుండా సరిగ్గా ఈ ముగ్గురి మధ్యే క్లాష్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

    యంగ్ హీరో నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతున్న భీష్మ, మాస్ మహారాజ్ రవితేజ- వీఐ ఆనంద్ కాంబినేషన్ లో రాబోతున్న డిస్కో రాజా, అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతీరోజు పండుగే సినిమాల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిని డిసెంబర్ నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు. పైగా అందరూ డిసెంబర్ 20 వ తేదీ వైపే కన్నేసి ఉంచారని తెలుస్తోంది.

    December Clash On tollywood industry

    ఎలాగూ ఈ సారి సంక్రాంతి బరిలో బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. సో సంక్రాంతి సీజన్ కంటే ముందే డిసెంబర్ చివర్లోనే తమ సినిమా రిలీజ్ చేసి కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూడు సినిమాల నిర్మాతలు. ఇదే జరిగితే రవితేజ, నితిన్, సాయి ధరమ్ తేజ్ మధ్య గట్టి పోటీ తప్పదు. చూడాలి మరి ఈ ముగ్గురిలో ఎవరైనా తప్పుకుంటారా? లేక అందరూ బరిలో నిలుస్తారా? అనేది.

    English summary
    tollywood star heroes Ravi Teja, Sai Dharam Tej, Nithiin are doing their projects. These three are going set release on december. It may happen clash on december month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X