twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ హీరోయిన్ ఇప్పుడు సునీల్ సరసన...

    By Srikanya
    |

    అల్లు అర్జున్,క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో హీరోయిన్ గా చేసిన దీక్షా సేధ్ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా సునీల్ ప్రక్కన చేయటానికి కమిటయ్యింది. నెపోలియన్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని రాజమౌళి వద్ద అశోసియేట్ దర్శకుడుగా పనిచేస్తున్న కోటి దర్శకత్వంలో డైరక్ట్ చేయనున్నారు. ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. శ్రాన్వి పతాకంపై ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మిస్తారు. రాజస్ధాన్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రం సంగీతం అందిస్తారు. ఇక ప్రస్తుతం సునీల్.. రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తున్న సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పలరాజు చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి డైరక్ట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X