Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్ హీరోయిన్ ఇప్పుడు సునీల్ సరసన...
అల్లు అర్జున్,క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో హీరోయిన్ గా చేసిన దీక్షా సేధ్ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా సునీల్ ప్రక్కన చేయటానికి కమిటయ్యింది. నెపోలియన్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని రాజమౌళి వద్ద అశోసియేట్ దర్శకుడుగా పనిచేస్తున్న కోటి దర్శకత్వంలో డైరక్ట్ చేయనున్నారు. ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. శ్రాన్వి పతాకంపై ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మిస్తారు. రాజస్ధాన్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రం సంగీతం అందిస్తారు. ఇక ప్రస్తుతం సునీల్.. రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తున్న సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పలరాజు చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి డైరక్ట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.