Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
SSMB29 మహేష్బాబుతో బాలీవుడ్ టాప్ బ్యూటీ.. పాన్ వరల్డ్ మూవీ కోసం జక్కన్న బిగ్ ప్లాన్!
తెలుగు చిత్ర పరిశ్రమలో నెవర్ బిఫోర్ అనేలా అతిపెద్ద కాంబినేషన్స్ తెరపైకి రాబోతున్నాయి. అందులో ఇప్పుడు ప్రధానంగా అందరు మాట్లాడుకుంటున్నది మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించే. ఈ సినిమా మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం విలన్ గురించి కొన్ని వార్తలు వైరల్ కాగా ఇప్పుడు హీరోయిన్ గురించి ఒక కొత్త టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
వచ్చే ఏడాది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో తన 29వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న మహేష్ బాబు వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే ఎ ఏడాది జనవరి తరువాత జక్కన్న దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే రాజమౌళి ఫైనల్ కథను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో
ఇంతకుముందు రాజమౌళి తండ్రి కథ రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో ఇంకా కథ సెట్ అవ్వలేదు అని కూడా అనుకున్నారు. ఇక రాజమౌళి అయితే దాదాపు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అయితే ఫినిష్ చేసే దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
విజువల్ ట్రీట్
ఆ మధ్య రాజమౌళి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థను కూడా సంప్రదించడం జరిగింది. పూర్తిస్థాయిలో గ్రాఫిక్స్ హైలైట్ అయ్యే విధంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉండబోతుందట. మహేష్ బాబు కూడా తన లుక్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
విలన్ పాత్ర కోసం
అయితే రాజమౌళి ఇంకా నటీనటుల విషయంలో ఏ విధంగా ఆలోచించాడు అనేది అఫీషియల్ గా ఎవరు చెప్పలేదు. కానీ ఇటీవల ఇండస్ట్రీలో వచ్చిన టాక్ ప్రకారం అయితే కొంతమంది యాక్టర్స్ ను కొన్ని పాత్రల కోసం ఫిక్స్ చేసుకున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళ హీరో కార్తీ ప్రధాన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
హీరోయిన్ కూడా ఫిక్స్?
ఇక ఇప్పుడు హీరోయిన్ పాత్ర కూడా దాదాపు ఫైనల్ అయినట్లు మరొక కొత్త టాక్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు దీపిక పదుకోన్ అని కూడా అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో ఆమె ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపిక పదుకోన్ ఇప్పుడు మహేష్ బాబు 29వ సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.