Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దర్శకుడు, హీరో మధ్య విభేదాలు.. ఎట్టకేలకు రిలీజ్కు సిద్దం
అసురన్ లాంటి చిత్రంతో దక్షిణాదిన సంచలనంగా మారిపోయాడు హీరో ధనుష్. విడుదలైంది కేవలం తమిళంలోనే అయినా అతని నటన మాత్రం అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. అసురన్ చిత్రం తమిళంలో వసూళ్ల సునామిని సృష్టించగా.. ఆ సినిమాపై పలు ఇండస్ట్రీల కన్నుపడింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధనుష్ లాంటి నటుడు, గౌతమ్ మీనన్ లాంటి వినూత్న దర్శకుడు కలిసి చేస్తే వచ్చే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి ఓ ప్రాజెక్ట్పై అనేక రూమర్ల వినిపిస్తున్నాయి. ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నప్పుడు సహజంగానే భేదాభిప్రాయాలు తలెత్తుతుంటాయి. అయితే అవి స్థాయిని దాటి వెళితే ఆ ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఇలాంటి సమస్యల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ 'ఎన్నై నోకి పాయుమ్ తోట' అనే సినిమాను రూపొందించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా విషయంలో, గౌతమ్ మీనన్కి .. ధనుష్కి మధ్య ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చాయని టాక్. ఈ కారణంగానే ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లకి పైగా పట్టిందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈనెల 29న విడుదల చేయనున్నారు. తెలుగులో 'తూటా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా విషయంలో దర్శకుడిని ధనుష్ పక్కన పెట్టేశాడని కొంతమంది అంటుంటే, గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదని మరికొందరు చెప్పుకుంటున్నారు.