Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు, హీరో మధ్య విభేదాలు.. ఎట్టకేలకు రిలీజ్కు సిద్దం
అసురన్ లాంటి చిత్రంతో దక్షిణాదిన సంచలనంగా మారిపోయాడు హీరో ధనుష్. విడుదలైంది కేవలం తమిళంలోనే అయినా అతని నటన మాత్రం అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. అసురన్ చిత్రం తమిళంలో వసూళ్ల సునామిని సృష్టించగా.. ఆ సినిమాపై పలు ఇండస్ట్రీల కన్నుపడింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధనుష్ లాంటి నటుడు, గౌతమ్ మీనన్ లాంటి వినూత్న దర్శకుడు కలిసి చేస్తే వచ్చే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి ఓ ప్రాజెక్ట్పై అనేక రూమర్ల వినిపిస్తున్నాయి. ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నప్పుడు సహజంగానే భేదాభిప్రాయాలు తలెత్తుతుంటాయి. అయితే అవి స్థాయిని దాటి వెళితే ఆ ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఇలాంటి సమస్యల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ 'ఎన్నై నోకి పాయుమ్ తోట' అనే సినిమాను రూపొందించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా విషయంలో, గౌతమ్ మీనన్కి .. ధనుష్కి మధ్య ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చాయని టాక్. ఈ కారణంగానే ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లకి పైగా పట్టిందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈనెల 29న విడుదల చేయనున్నారు. తెలుగులో 'తూటా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా విషయంలో దర్శకుడిని ధనుష్ పక్కన పెట్టేశాడని కొంతమంది అంటుంటే, గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదని మరికొందరు చెప్పుకుంటున్నారు.