Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అసలుకొడుకు దొరికాడు? హీరో ధనుష్కు ఊరట.. !?
చిన్నతనంలో తమ ఇంటి నుంచి పారిపోయిన తమ కుమారుడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడని కదిరేశన్ దంపతులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
ధనుష్ పెళ్లి సమయంలో ఓ వ్యక్తి ఈ హీరో తమ కొడుకని, మాకు అప్పగించాలని అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.దీనిపై అప్పుడు ధనుష్ ఫాదర్, డైరెక్టర్ కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి ఆ వివాదాన్ని పక్కకు జరిపారు. అయితే తర్వాత తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అయితే అలా అనుకున్నారు. తాజాగా మళ్ళీ అదే వివాదం తెర మీదకొచ్చింది.
కదిరేశన్, మీనాక్షి దంపతులు
మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మదురై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను, వాళ్లు కోర్టులు అందజేసిన పత్రాలను జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు.ఈ నేపథ్యంలో ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ నటుడు ధనుష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.
స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని
ఈ కేసును విచారించిన కోర్టు పలుమార్లు విచారించింది. తాజాగా స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది.
లేజర్ ద్వారా మచ్చలను తొలగించి
ఈ నేపథ్యంలో మధురై కోర్టులో హాజరైన ధనుష్కు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ మెడికల్ రిపోర్టులో ధనుష్ లేజర్ ద్వారా మచ్చలను తొలగించినట్లు తేలింది. ఫలితంగా ధనుష్ కదిరేశన్ దంపతులకు జన్మించిన బిడ్డేనని వచ్చిన ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
తమ కుమారుడు
చిన్నతనంలో తమ ఇంటి నుంచి పారిపోయిన తమ కుమారుడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడని కదిరేశన్ దంపతులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తద్వారా ధనుష్కు ఈ కేసు నుంచి విముక్తి లభించినట్లేనని సినీ జనాలు అంటున్నారు. అయినప్పటికీ ఇంకా కోర్టు తీర్పు వెలువరించని కారణంగా..
తుది విచారణ
ఏప్రిల్ 11 (మంగళవారం) ఈ కేసు తుది విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ధనుష్ పుట్టుమచ్చలు, డీఎన్ఏ టెస్టుపై విచారణ జరుగవచ్చునని తెలుస్తోంది. ఈ విచారణకు అనంతరమే కోర్టు తీర్పునివ్వనుంది.
మేలూరులో
మధురై జిల్లాలోని మలంపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రయివేట్ బస్ కండక్టర్ అయిన కదిరేశన్ (60) - మీనాళ్ (55) దంపతులు మేలూరు మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. ఈ దంపతులే హీరో ధనుష్ తమ కొడుకని, తన అసలు పేరు కలై సెల్వన్ అని, పదో తరగతి వరకు మేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని చెప్పారు.
అసలు పేరు కలైసెల్వన్
అంతేకాకుండా ధనుష్ ఇంటర్ అడ్మిషన్ శివగంగలో తీసుకున్నామని,అతని అసలు పేరు కలైసెల్వన్ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు.
కోలీవుడ్ లో అనుమానాలు
అంత బలంగా ఎలా ఎచెప్పగలుగుతున్నారు అన్న అనుమానాలూ కలుగుతున్నాయ్. మరీ ఇంటర్ తర్వాత ఇంటినుంచి వెళ్ళిపోయాడన్న మాట కదిరేషన్ దంపతులు చెబుతున్నారు, ధనుష్ ని చిన్న తనం నుచీ కస్తూరిరాజా ఇంట్లో ధనుష్ ని చూసిన వాళ్ళు ఎవరూ నోరు విప్పకపోవటం, కస్తూరి రాజా ఫ్యామిలీతో ధనుష్ చిన్న నాటి ఫోటోలని విడుదల చేయకపోవటం వల్ల కూడా కోలీవుడ్ లో అనుమానాలు రేకెత్తాయి... మొత్తానికి ధనుష్ ఈ కేసునుంచి బాగానే "బయటపడ్డాడు"