Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Sekhar kammula సినిమా కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. డబుల్ చేసేసిన ధనుష్?
ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ ఊహించని, మునుపెన్నడూ అంచనా వేయని కాంబినేషన్లు ఫిక్సవుతున్నాయి. దాదాపు అన్ని బాషల హీరోలకు, అన్ని బాషల సినిమాలకు మార్కెట్ లు భారీగా పెరుగుతూ ఉండడంతో ఊహకందని కాంబోలతో ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా శేఖర్ కమ్ముల -ధనుష్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ కాగా ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
ట్రై లింగ్యువల్ సినిమా
తమిళ స్టార్ హీరోగా ఉన్న ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో జట్టు కట్టారు. ఒకరకంగా ధనుష్ ఇప్పుడు తమిళంతో పాటు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన శేఖర్ తో కలిసి ఒక ట్రై లింగ్యువల్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు.
మార్కెట్ లెక్కలతో
నిజానికి దాదాపుగా ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన చేత ఇలా ఒక సినిమా చేయిస్తే దానిని తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయవచ్చని ప్లాన్ చేశారు.
ఆ నిర్మాతలే రెండో సారి
ఇక ఈ కాంబో సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద ఏషియన్ సంస్థ తరపున నారాయణ రావు దాస్ నారంగ, పుస్కుర్ రామమోహనరావు నిర్మించబోతున్నారు. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో పాటు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
ఏకంగా డబుల్ ఛార్జ్
ఇక ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మార్కెట్ పెద్దది కావడం ఎక్కువ డేట్స్ కూడా కేటాయించాల్సి రావడంతో ఆయన డబుల్ ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన చివరిగా నటించిన జగమే తంత్రం సినిమా 17 భాషల్లో 190 దేశాల్లో రిలీజైంది. ఈ సినిమా కోసం ఆయన 15 కోట్లే తీసుకోగా శేఖర్ సినిమా కోసం దానికి డబుల్ ఛార్జ్ చేసినట్లు సమాచారం.
Recommended Video
హీరోయిన్ ఆమేనా
ఇక ఈ సినిమా గురించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో ధనుష్కు జోడీగా హీరోయిన్ సాయి పల్లవి నటించనుందని అంటున్నారు. ఇప్పటికే మేకర్స్ చర్చలు జరిపారని, సాయిపల్లవి కూడా సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.