Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జాన్ అబ్రహంతో ధోనీ బాలీవుడ్ ఎంట్రీ?
మహేంద్ర సింగ్ ధోని త్వరలో బాలీవుడ్ తెరపై మెరవబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'హుక్ యా క్రూక్ " సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ధోనీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందు కోసం ఇప్పటికే ధోనీ వద్ద డేట్స్ తీసుకున్నారని, 15 రోజుల పాటు ధోనీ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ధోనీ ఇందులో ముఖ్యమైన అతిపాత్రలో ధోనీ కనిపించనున్నాడని తెలుస్తోంది.
సత్తా ఉన్న క్రికెటర్ గా, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా దూసుకెలుతున్న ధోనీ....ఇప్పటికే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ ఎంట్రీతో ఒకే సారి మూడు రంగాల్లో రాణిస్తున్న వ్యక్తిగా ధోనీ రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ధోనీ బాలీవుడ్ ఎంట్రీ కనుక సక్సెస్ అయితే ఆయకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడటం ఖాయం.
ప్రస్తుతం ధోనీ సంపాదన సంవత్సనికి వందల కోట్లలోనే. వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారానే ధోనీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కవ ఆదాయం గల టాప్ టెన్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక బాలీవుడ్ లోనూ క్లిక్ అయితే ధోనీ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లి పోతాడేమో..?