హీరోయిన్, డైరెక్టర్ మధ్య విభేదాలు, షాక్ అయ్యే నిజం ఏంటంటే!
మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది.తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ కు ఆమె పూర్తి సహకారం అందించింది, కాని ఒక్క విషయంలో కీర్తి సురేష్ డైరెక్టర్ మాట వినలేదని సమాచారం.

సావిత్రి పాత్రకు నిత్య మీనన్!
వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగ్అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ఆ పాత్ర కోసం కీర్తిసురేష్ని ఎంపిక చేసి సమంతకు చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చారు. ముందుగా సావిత్రి పాత్రకు నిత్య మీనన్ ను తీసుకుందాం అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ పాత్ర చెయ్యలేదు.

మామూలు కుటుంబం నుండి మహానటిగా
నేను శైలజ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతుంది. మహానటి సినిమా ఆమె కెరీర్ కు ఇంకా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో సావిత్రి ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి మహానటిగా ఎదిగిన పరిణామాలతో పాటు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సైతం చూపించినట్లు తెలుస్తోంది.

సహకారం అందించిన కీర్తి
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ కు ఆమె పూర్తి సహకారం అందించింది, కాని ఒక్క విషయంలో కీర్తి సురేష్ డైరెక్టర్ మాట వినలేదని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే...

ఆ ఇద్దరి మధ్య విభేదాలు
అలనాటి నటి సావిత్రి పెళ్ళికి ముందు సన్నగా ఉంది కాని పెళ్లి తరువాత ఆమె లావు అయ్యింది. కీర్తి సురేష్ ఫిజిక్ పెళ్లి కానంతవరుకు సావిత్రి పాత్రకు సెట్ అయ్యింది.కాని పెళ్లి తరువాత సావిత్రి పాత్ర కోసం డైరెక్టర్ కొద్దిగా బరువు పెరగమని ఆమెకు చెప్పడం జరిగిందట కానీ ఆమె డైరెక్టర్ మాట వినలేదు, ఈ విషయంలో ఇద్దరికి విభేదాలు వచ్చాయని సమాచారం.


Click it and Unblock the Notifications











