Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మహర్షి’ వివాదం దిల్ రాజు ఎలా సెట్ చేశాడు? అశ్వినీదత్, పివిపి హ్యాపీనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో బుధవారం(మే 1)న గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంటులో నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నవ్వుతూ కనిపించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందుకు కారణం ఈ వేడుక జరుగడానికి రెండు రోజుల ముందు ఈ ముగ్గురి మధ్య సినిమాకు సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్లో విబేధాలు వచ్చాయనే రూమర్స్ రావడమే.
దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలయిక వెనక కారణం ఏమిటి?
మహేష్ బాబు 25న సినిమాను సోలోగా నిర్మించగల సత్తా ఉన్న నిర్మాత దిల్ రాజు. అయితే మహేష్ బాబు కోరిక మేరకు అశ్వినీదత్, పివిపిని ఇందులో భాగస్వాములుగా చేశారట. మహేష్ బాబుతో వారికి గతంలో సినిమా అడ్వాన్సులకు సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూలు ఉన్నాయని... అవన్నీ ఈ సినిమాతో సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో సూపర్ స్టార్ ఈ ప్లాన్ వేశారని టాక్.
అశ్వినీదత్ కిరికిరి?
ఇటీవల ఓ ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ విషయంలో అశ్వినీదత్, దిల్ రాజు మధ్య విబేధాలు వచ్చాయని... తనకు ఆ ఏరియా రైట్స్ అప్పగించాలని కోగా, అగ్రిమెంట్ ప్రకారం అలా కుదరని దిల్ రాజు చెప్పడంతో విషయం పెద్దదైందని, మహేష్ బాబు కూడా మ్యాటర్లో ఇన్వాల్వ్ కావడంతో అంతా కూర్చుని పరిష్కరించుకున్నట్లు టాక్.
కొంత మొత్తం ఇచ్చేసి సెట్ చేశారా?
ఈ చర్చల్లో అశ్వినీదత్కు కొంత మొత్తం ఇచ్చేసి సెటిల్మెంట్ చేసినట్లు తాజాగా ఫిల్మ్ నగర్లో వార్తలు వెలుగులోకి వచ్చాయి. రేపు ‘మహర్షి' విడులైన తర్వాత వచ్చే రెవెన్యూతో ఎలాంటి సంబంధం లేకుండా ఆ మొత్తం తీసుకుని అశ్వినీదత్ పక్కకు జరిగినట్ల చెబుతున్నారు.
పీవీపీ హ్యాపీనా
ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో పీవీపీ కోర్టుకు వెళ్లి సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి తన బేనర్లో ఈ కథ చేయడానికి సిద్ధమై దిల్ రాజు, అశ్వీనీదత్ వైపు వెళ్లడమే ఇందుకు కారణం. తర్వాత మహేష్ బాబు ఎంటరై ఆయన్ను కూడా ఇందులో భాగం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందు ముగ్గురు నిర్మాతలు కూర్చుని అన్ని సమస్యను పరిష్కరించుకున్నారని... సినిమా విడుదలైన తర్వాత తనకు వచ్చే వాటా విషయంలో కూడా పివిపి హ్యాపీగా ఉన్నట్లు టాక్.
మెజారిటీ వాటా దిల్ రాజు సొంతం
‘మహర్షి' సినిమాకు సంబంధించి మెజారిటీ వాటా దిల్ రాజుకే దక్కుతుందని తెలుస్తోంది. ప్రొడక్షన్ బాధ్యతలు కూడా ముందు నుంచీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. సినిమాపై భారీ హైప్ రావడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. రేపు మూవీ రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో? ఎన్ని కోట్ల లాభం తెచ్చి పెడుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.