twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్-త్రివిక్రమ్ క్రేజ్... కోట్లు కుమ్మరించిన దిల్ రాజు?

    పవన్25 మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. తాజాగా నైజాం రైట్స్ రికార్డు స్థాయి రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Dil Raju Bought Nizam Rights Of PSPK25 పవన్-త్రివిక్రమ్ క్రేజ్...

    పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. అందులో జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వం అంటే బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

    ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ క ళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రైట్స్ దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. తెలుగు సినిమా రంగంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్న దిల్ రాజు.... ఈ చిత్రం నైజాం రైట్స్ దక్కించుకోవడానికి కోట్లు కుమ్మరించినట్లు ప్రచారం జరుగుతోంది.

    భారీగా బిజినెస్

    భారీగా బిజినెస్

    పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. సెట్స్ పై ఉండగానే ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతోంది.

    రూ. 29 కోట్లు పెట్టిన దిల్ రాజు?

    రూ. 29 కోట్లు పెట్టిన దిల్ రాజు?

    ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రూ. 29 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

    బాహుబలి తర్వాత ఇదే

    బాహుబలి తర్వాత ఇదే

    నైజాం ఏరియాలో 'బాహుబలి' తరువాత ఈ స్థాయి రేటు పలికి సినిమా ఇదేనని, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తప్పకుండా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయిని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    శాలిలైట్ రైట్స్

    శాలిలైట్ రైట్స్

    జెమినీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ రూపంలోనే ఈచిత్రానికి ఇంత భారీ రేటు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ డబ్బుతో ఓ మీడియం రేంజి తెలుగు సినిమా తీయొచ్చని చర్చించుకుంటున్నారు.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    మరో వైపు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు ముందస్తుగానే భారీగా థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

    అంచనాలు భారీగానే

    అంచనాలు భారీగానే

    గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారంటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

    English summary
    If the latest reports are true by any chance, Dil Raju bought Nizam Rights of PSPK25 for Rs 29 crore. As per trade circles, Pre-Release Business of #PK25 is expected to touch Rs 100 crore-mark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X