Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దిల్ రాజు మందు పార్టీ...వివాదాస్పదం?
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యవహార శైలి వివాదాస్పదమైంది. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటుడు సాయికుమార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్తో పాటు 'ఎవడు' సినిమా వాయిదా తేదీని ప్రకటించేందుకుగాను శనివారం సాయంత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వంశీ పైడిపల్లి, సాయికుమార్ పుట్టిన రోజును పురస్కరించుకుని.... ఎప్పటిలా సాధారణంగా కాకుండా కాస్త గ్రాండ్గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత అతిథుల కోసం విందు, మందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.30 గంటలకు సమావేశం అని చెప్పడంతో మీడియా మిత్రులంతా సమయానికి చేరుకున్నారు.
అయితే నిర్మాత దిల్ రాజు సమయానికి రాకుండా రెండు గంటలు ఆలస్యంగా ప్రెస్మీట్ హాజరయ్యారు. దీంతో విసుగుచెంది ఉన్న పాత్రికేయులు ఆలస్యంపై దిల్ రాజును ప్రశ్నించారు. దీనికి దిల్ రాజు బదులు ఇస్తూ...'మందు పార్టీ ఉందిగా, ఆ మాత్రం ఒపిక పట్టలేరా?' అనే భావంతో కాస్త ఒగరుగా సమాధానం ఇచ్చారట.
దీంతో ఆగ్రహానికి గురైన పాత్రికేయులు.....మందు పార్టీ కోసం తాము రాలేదని, తమను వెయిట్ చేయించింది కాక ఇలా మాట్లాడటం మర్యాద కాదని పాత్రికేయులంటా దిల్ రాజు ఏర్పాటు చేసిన పార్టీని బహిష్కరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తలో పడ్డ దిల్ రాజు పాత్రికేయులను బుజ్జగించే ప్రయత్నం చేసారని ఈ ప్రెస్ మీట్కు హాజరైన పాత్రికేయ మిత్రులు వెల్లడించారు.