Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
యంగ్ దర్శకులను నిలువెత్తున ముంచుతున్న దిల్ రాజు...
తన బ్యానర్ లో నిర్మించే చిత్రాల ద్వారా కొత్త టాలెంట్ కు అవకాశాలిస్తూ..గత కొంతకాలం వరకు వరుస హిట్ లు సాధిస్తూ వచ్చిన నిర్మాత 'దిల్ రాజు". ఈయన సంస్థలో చిత్రం చేయాలంటే ఆ దర్శకుడికి సహనం, ఓపిక కాస్త ఎక్కువుండాల్సిందే..గోపిచంద్ 'లక్ష్యం" దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీవాస్, ఆ చిత్రం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయాలని చాలా రోజులు వెయిట్ చేశాడు. అతని సహనం పరాకాష్టకు చేరుకున్న దశలో దిల్ రాజు శ్రీవాస్ డైరెక్షన్ లో రామ్ హీరోగా 'రామరామ కృష్ణకృష్ణ"తీయించాడు. అది బాక్సావద్ద బోర్లపడటంతో ప్రస్తుతం శ్రీవాస్ కు డైరెక్టర్ గా అవకాశలే కరువయ్యాయి.
ఇక 'కొత్తబంగారు లోకం" అంటూ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు తర్వాత సినిమా నా బ్యానర్ లోనే చేయాలని..ఇప్పటి వరకూ తన తొలి సక్సెస్ ని క్యాష్ చేసుకోనివ్వని దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు హీరోలుగా 'సిరిమల్లె చెట్టుకింది సీతామాలక్ష్మీ" అనే చిత్రం రాబోతోందని అంతా ప్రచారం జరిగిందే కానీ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు కాంపౌండ్ లో అలాగే రిజర్వ్ లో ఉంటే మరో శ్రీవాస్ గా మిగిలిపోవాల్సిందే.