twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు, అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్.. దిల్ రాజు ఎంటర్..ఫైనల్ డిసీజన్!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య సీక్రెట్ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. వీరికి ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు అని టాక్ నడుస్తోంది. ఈ ముగ్గురూ కలిసి సీక్రెట్‌గా మంతనాలు చేసి చివరకు ఓ ఫైనల్ డిసీజన్ తీసుకున్నారని అంటున్నారు. ఇంతకీ ఆ డిసీజన్ ఏంటి? సీక్రెట్ మీట్ ఎందుకు జరిగింది? వివరాల్లోకి పోతే..

    మహేష్ బాబు, అల్లు అర్జున్ వార్

    మహేష్ బాబు, అల్లు అర్జున్ వార్

    అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో ఈ ఇద్దరూ జనవరి 12వ తేదీని విడుదల తేదీగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఇద్దరు స్టార్ హీరోల వార్ అనివార్యమైంది.

    పోటాపోటీగా రంగంలోకి

    పోటాపోటీగా రంగంలోకి

    మహేష్, అల్లు అర్జున్ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో పోటాపోటీగా రంగంలోకి దిగారు ఇరు సినిమాల దర్శకనిర్మాతలు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన వెంటనే మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబో మూవీ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాను అదే డేట్‌లో విడుదల చేయబోతున్నట్లు చెప్పేశారు.

    పరిస్థితి గమనించిన దిల్ రాజు

    పరిస్థితి గమనించిన దిల్ రాజు

    దీంతో ఈ సంక్రాంతికి బిగ్ క్లాష్ తప్పదని ఫిక్స్ అయ్యారంతా. కానీ పరిస్థితి గమనించిన దిల్ రాజు.. అల్లు అర్జున్, మహేష్ బాబులతో సీక్రెట్ మీట్ ఏర్పాటు చేసి.. వారిరువురి నడుమ రాజీ కుదిర్చినట్లుగా సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని, అలాగే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 11న విడుదల చేయాలని వాళ్ళ మధ్య ఓ ఒప్పందం కుదిర్చారని తెలుస్తోంది.

    దిల్ రాజు ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే..

    దిల్ రాజు ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే..

    మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ‘అల వైకుంఠపురములో' సినిమా నైజాం రైట్స్ దిల్ రాజే తీసుకున్నాడు. సో.. కమర్షియల్‌గా ఈ రెండు సినిమాల క్లాష్ అంతమంచిది కాదని ఆయన భావించి ఇలా ఎంటర్ కావాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది.

    దిల్ రాజు రిక్వెస్ట్.. తప్పక మహేష్, అల్లు అర్జున్

    దిల్ రాజు రిక్వెస్ట్.. తప్పక మహేష్, అల్లు అర్జున్

    దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు మహేష్, అల్లు అర్జున్ ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చి రెండు రోజుల గ్యాప్‌తో వారి వారి సినిమాలు రిలీజ్ చేసేందుకు అంగీకారం తెలిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా మహేష్ ‘భరత్ అను నేను', అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య' సినిమాల విషయంలోను ఇలాగే క్లాష్ ఎదుర్కొని చివరకు వారం తేడాలో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. చూడాలి మరి ఈ వార్తలపై ఈ రెండు సినిమాల పీఆర్ టీమ్స్ ఎలా స్పందిస్తాయనేది.

    English summary
    Allu Arjun and trivikram new movie Ala Vaikutapuramlo release date fixed. At the same date Mahesh Babu- Anil Ravipudi's SariLeru Neekevvaru release fixed. So in this issue Dil Raju entered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X