Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
దిల్ రాజుపై నిషేధం?
ఎ.పి.ఫిలిం ఛాంబర్..ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై బ్యాన్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణంయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఆ మధ్య మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్ కి సినిమాకు సంభందించిన ఏ విషయంలోనూ సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు తన జోష్ చిత్రం ఆడియో పంక్షన్ లైవ్ ని మాటీవీకి ఇవ్వటంతో ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్స్ కి పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్ గా యాక్షన్ తీసుకోవటానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. అయితే మగధీర ఆడియో పంక్షన్ కూడా మాటీవీలో లైవ్ ఇవ్వటంతో అల్లు అరవింద్ పై యాక్షన్ తీసుకున్న తర్వాతే ఈ మేటర్ తేల్చాల్సి ఉంటుందని కొందరు సీనియర్స్ అంటున్నారు.