Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్లోకి దిల్ రాజు భార్య ఎంట్రీ: ఆ సినిమా కోసం స్పెషల్ ప్లాన్ రెడీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ను ఆరంభించిన ఆయన... నితిన్ నటించిన 'దిల్' అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుని స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయారు. అప్పటి నుంచి మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ, మధ్య మధ్యలో కొన్ని చిత్రాలను పంపిణీ సైతం చేస్తున్నారు. మాంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరున్న దిల్ రాజు.. తన భార్యను టాలీవుడ్లోకి తీసుకు రాబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
వరుస విజయాలకు బ్రేక్ పడింది
నిన్న మొన్నటి వరకు వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోయాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. గత ఏడాది ‘F2' వంటి బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ఆ తర్వాత మరికొందరి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించారు. వాటి ద్వారా బాగా లాభపడ్డారు. అయితే, ఈ ఏడాది వచ్చిన ‘జాను', ‘ఇద్దరి లోకం ఒకటే' చిత్రాలు ఆయనను తీవ్రంగా నిరాశ పరిచాయి.
పవన్తో రీఎంట్రీ ఇప్పిస్తున్నాడు
టాలీవుడ్లోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశాడు దిల్ రాజు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవన్ కల్యాణ్తో ‘వకీల్ సాబ్' ద్వారా రీఎంట్రీ ఇప్పిస్తున్నారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్తో కలిసి నిర్మిస్తున్నాడాయన. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ.. వచ్చే ఏడాది విడుదల కానుంది.
లాక్డౌన్లో పెళ్లి చేసుకున్న రాజు
దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి విధితమే. ఆమె పోయిన తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్న ఆయన.. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా నిరాడంభరంగా జరిగిన ఈ వేడుకను నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపారు.
టాలీవుడ్లోకి దిల్ రాజు భార్య ఎంట్రీ
దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆయన సోదరులు కూడా నిర్మాతలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అలాగే, ఆయన కుమార్తె ఆహా వీడియో కోసం పని చేస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సతీమణి తేజస్వినీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Recommended Video
ఆ సినిమా కోసం స్పెషల్ ప్లాన్ రెడీ!
లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిపోయిన థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దిల్ రాజు భార్య కూడా ఓ ఓటీటీ సంస్థ కోసం రచయితగా మారారని సమాచారం. ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసిన ఆమె.. దానికి మెరుగులు దిద్దుతున్నారని తెలిసింది. దీన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.