Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన అగ్ర దర్శకుడు.. మరో సూపర్ ప్లాన్ వేసిన మెగా టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మళయాళం హిట్ మూవీ లూసిఫర్ ను రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఆ సినిమా తెలుగులో డబ్ అయినప్పటికీ మెగాస్టార్ ఎంతో ఇష్టంతో ఆ సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యారు. తెలుగు వారి అభిరుచికి తగ్గట్లుగానే సినిమాలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది.
కమెడియన్ వివేక్ ఫోటో గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని అరుదైన ఫోటోలు
సైరా అనంతరం
సైరా అనంతరం మెగాస్టార్ చిరంజీవి కథల సెలక్షన్ విషయంలో చాలా స్పీడ్ పెంచారు. కొరటాల శివతో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ తో కలిసి నటించారు.
ఆ దర్శకుల తరువాత
ఇక ఆచార్య అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని చాలా రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే లూసిఫర్ ను లైన్ లో పెట్టారు. దర్శకుడిగా మోహన్ రాజాను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. వివి.వినాయక్, సుజిత్ వంటి దర్శకుల అనంతరం మోహన్ రాజను సెలక్ట్ చేసుకున్నారు.
విలన్ పాత్ర కోసం అనురాగ్ కశ్యప్..
ఆల్ మోస్ట్ సినిమాను స్టార్ట్ చేయబోయే సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదకవ్వడం వలన బ్రేక్ పడింది. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి ప్రీ ప్రొడక్షన్ పనులపై చిత్ర యూనిట్ మరోసారి ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ ను ఎదుర్కోబోయే విలన్ ఎవరనే విషయంలో గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా బాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది.
రిజెక్ట్ చేసిన దర్శకుడు
నిజానికి అనురాగ్ కశ్యప్ తో సంప్రదింపులు జరిపిన వార్త నిజమే. అయితే ఆ దర్శకుడు తన సినిమాలతో బిజీగా ఉండడం వలన నటుడిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది.
Recommended Video
తెలుగులోనే మరో పవర్ఫుల్ విలన్
ఇక అనురాగ్ కశ్యప్ రిజెక్ట్ చేయడంతో చిత్ర యూనిట్ తెలుగులోనే ఒక పవర్ఫుల్ విలన్ ను సెలెక్ట్ చేసుకునే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. లుసిఫార్ రీమేక్ ను ఇదే ఏడాది వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఎడాది సంక్రాంతి అనంతరం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక సినిమాకు సంబంధించిన మరొక స్పెషల్ అప్డేట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం.