twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి బాలయ్యపై ఫోకస్ పెట్టిన క్రిష్.. త్వరలోనే బిగ్ న్యూస్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సందేశాత్మక సినిమాలతో ఎక్కువగా గుర్తింపు అందుకున్నటువంటి అతి కొద్దిమంది దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఈ దర్శకుడు కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సక్సెస్ అందుకున్న చాలా కాలం అవుతోంది. కంచె గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల అనంతరం మళ్ళీ సరైన విజయాన్ని అందుకోలేదు. బాలకృష్ణతో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కించిన క్రిష్ ఊహించని స్థాయిలో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఈ దర్శకుడు టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ హిస్టారికల్ కథను తెర పైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. హరిహర వీరమల్లు పాన్ ఇండియా మార్కెట్కు తగ్గట్లుగానే రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. దర్శకుడు క్రిష్ ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి తన సత్తా ఏంటో చూపించాడు.

    ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అంతకు మించి అనేలా మరో చారిత్రాత్మక కథను తెర పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హరివరం వీరమల్లు సినిమాను మొదలు పెట్టిన తర్వాత దర్శకుడు క్రిష్ ఆ సినిమాని పక్కన పెట్టే వేరే పనులు కూడా పూర్తి చేయాల్సి వస్తోంది. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే ఈ సినిమాను క్రిష్ చాలా వేగంగా పూర్తి చేశాడు. ఈ శుక్రవారం సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

    Director krish another plan with nandamuri balakrishna

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోసం సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే కొంత సమయం మిగిలి ఉండడంతో ఈ దర్శకుడు బాలకృష్ణతో మరో ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆహా యాప్ కోసం ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. అయితే ఆ టాక్ షోకి సంబంధించిన కాన్సెప్ట్ తో పాటు ప్రమోషనల్ యాడ్స్ అలాగే షోకు పూర్తిగా డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో క్రిష్ మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే భవిష్యత్తులో వీరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అయితే వస్తోంది. ఇక ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. మరో రెండు వారాల్లో ఈ సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అలాగే గోపీచంద్ మలినేనితో కూడా బాలయ్య మరొక సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి రానుంది. అలాగే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

    English summary
    Director krish another plan with nandamuri balakrishna,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X