Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారీ బడ్జెట్తో స్టార్ డైరెక్టర్ వెబ్ సిరీస్.. రోజా సీక్వెల్ తరువాత..
ప్రస్తుత రోజుల్లో వెబ్ సిరీస్ ల హవా ఎక్కువగా నడుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ లకు జనాలు బాగా అలవాటు పడ్డారు. కాన్సెప్ట్ క్లిక్కయితే సీరియల్స్ కంటే కూడా వెబ్ సిరీస్ ల పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక త్వరలో మరో సీనియర్ దర్శకుడు కూడా వెబ్ సిరీస్ కోసం కొత్త తరహా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. సీనియర్ డైరెక్టర్ మణిరత్నం.
ప్రస్తుతం భారీ బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ సినిమాను తెరకెక్కిస్తున్న మణిరత్నం నెక్స్ట్ వెబ్ సిరీస్ పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ బడ్జెట్ తో ఇండియాలో జరుగుతున్న ఒక అతి పెద్ద స్కామ్ పై వెబ్ సిరీస్ ని తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి మణిరత్నం నిర్మాతగా కొత్త వెబ్ సిరీస్ ని డిజైన్ చేయనున్నాట. మణి దగ్గర వర్క్ చేస్తున్న ఒక కొత్త దర్శకుడు ఆ కాన్సెప్ట్ కి దర్శకత్వం వహించనున్నాడట.
పొన్నియిన్ సెల్వన్ అనంతరం రోజా సినిమాకు సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్న మణిరత్నం ఆ తరువాత ఆ వెబ్ సిరిస్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టబోతున్నాడు మణిరత్నం. లాక్ డౌన్ కారణంగా ఆ హిస్టారికల్ మూవీకి బ్రేక్ పడింది. చియన్ విక్రమ్, కార్తీ, జయం రవి వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఆ సినిమాలో ఐశ్వర్యారాయ్ త్రిష వంటి సీనియర్ హీరోయిన్స్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.