twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండ క్రేజీ కాంబో మరోసారి రిపీట్.. ఆడియన్స్‌కి పండగే!

    |

    టాలీవుడ్ రౌడీగా పేరొందాడు విజయ్ దేవరకొండ. అనతి కాలంలోనే క్రేజీ స్టార్‌గా కీర్తించబడిన ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో రాబోయే ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్టుని తన సక్సెస్ ఫుల్ జోడీతో చేయబోతున్నారట. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన గీతాగోవిందం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ కాంబోలోనే మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

    నిజానికి 'గీతగోవిందం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా చేయాలని ప్లాన్ చేశారు డైరెక్టర్ పరశురామ్. కానీ మహేష్ బాబు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమాను తెరకెక్కించలేక పోయారు. అయితే తన వద్ద ఉన్న స్క్రిప్ట్‌నే కాస్త మోడిఫై చేసి ఆ సినిమాకు విజయ్ దేవరకొండ తోనే చేయాలని భావిస్తున్నారట పరశురామ్. ఈ నేపథ్యంలో విజయ్‌కి స్టోరీ లైన్ వినిపించేందుకు ఆయన సిద్దమయ్యాట. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా పరశురామ్ కథను ఓకే చేస్తారా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్‌కి పండగే.. ఇద్దరి ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ పడటం ఖాయమే!

    Director Parasuram will Again with Vijay Deverakonda?

    విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఆయన నటించిన 'డియర్ కామ్రేడ్' మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. మరికొద్ది రోజుల్లోనే 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Tollywood hero Vijay Deverakonda will again perform in Parasuram direction. As per latest talk in this combination new movie will start shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X