twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అధినాయకుడు' స్టోరీలో మరో ట్విస్టు...

    By Staff
    |

    Chiranjeevi
    చిరంజీవి 149వ చిత్రం 'అధినాయకుడు'... ఆయన యాక్షన్ సినిమా కథలాగానే రోజుకో విచిత్రమైన ట్విస్టుతో అందరిలో ఆసక్తి రేపుతోంది. మొదట అసలు చిరంజీవికి ఈ సినిమా చేసే యోచన లేదని...టాక్ వచ్చింది. తర్వాత ఈ సినిమానే కాదు అసలు ఏ సినిమాలోనూ ఇప్పట్లో చేయరు అన్నారు. తర్వాత కొంత కాలానికి 'అధినాయకుడు' వస్తోందనీ పరుచూరి వారు స్క్రిప్టు వండుతున్నారు...ఎన్.శంకర్ దర్శకత్వ వహిస్తాడని అన్నారు. తర్వాత ఇవేమీ నిజం కాదు నాగబాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆ టైటిల్ వాడుతున్నారని అన్నారు. తర్వాత కాదు...కాదు...ఆ టైటిల్ తన అన్నకే సూటవుతుందని నాగబాబు తన సినిమాకే ఉంచుతానని అన్నాడు.

    తన చిత్రానికి 'ఏక్ పోలీస్' అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఇలా తడవకో మలుపు తిర్గుతున్న ఈ కథనం ఇప్పుడు మరో ముఖ్యమైన మలుపు తీసుకుంది. చిత్రానికి దర్శకుడు మారాడని తెలుస్తోంది. 'పాండురంగడు' సినిమా తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో వుంచుకుని రాఘవేంద్రరావునే డైరెక్ట్ చేయమని చిరంజీవి కోరినట్లు తెలిసింది. రాఘవేంద్రరావు కూడా దీనికి సరేనన్నారు. ఈ సినిమాను రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సి. అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు రచన చేస్తున్నారు. మరి ఈ మార్పైనా మారకుండా సినిమా సెట్స్ మీదకు వెళ్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.


     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X