Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్లాన్ మార్చిన సాహో దర్శకుడు.. మెగాస్టార్ చిరంజీవిని కాదని ఆ హీరోతో..?
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమా అవకాశాలు దక్కించుకోవచ్చని నేటి యువతరానికి ఒక స్ఫూర్తిని నింపిన దర్శకుడు సుజిత్. మొదటి సినిమా రన్ రాజా రన్ హిట్ అయ్యిందో లేదో రెండవ అడుగులోనే ప్రభాస్ లాంటి హీరోను లైన్ లో పెట్టాడు. దాదాపు సాహో సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టేస్తున్నాడు అనుకున్న సమయంలో ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్నాడు.
బాలీవుడ్ లో మాత్రమే సక్సెస్ అందుకున్న సుజిత్ సౌత్ లో మాత్రం మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అనే కామెంట్స్ అందుకున్నాడు. అయినప్పటికీ డైరెక్టర్ మేకింగ్ లో ఎదో కొత్తదనం ఉందని మంచి స్క్రిప్ట్ సెట్ చేసుకుంటే సరైన హిట్ కొడతాడు అని సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి పిలిచిమరి లూసిఫర్ రీమేక్ బాధ్యతలను అప్పగించాడు. కథలో మార్పులు చేయమని హోమ్ వర్క్ ఇచ్చారు.
స్క్రిప్ట్ పై బాగానే హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఇంతవరకు మెగాస్టార్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడో లేదో తెలియదు గాని సుజిత్ మరొక హీరోను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపిచంద్. ఇటీవల సుజిత్ ఈ మాస్ హీరోను కలిసి మంచి యాక్షన్ కథను చెప్పడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.