twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలకు ట్విస్ట్ ఇస్తున్న సుకుమార్?

    By Staff
    |

    Sukumar
    ఆర్య సినిమాతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న లెక్కల మాస్టారు తర్వాత జగడం తీసి రాంగ్ క్యాలుక్యులేట్ చేసాడనిపించుకున్నాడు. దాంతో సేఫ్ గా తన హిట్ ని తనే క్యాష్ చేసుకునేందుకు ఆర్య సీక్వెల్ తీయటానికి నడుం బిగించాడు. అయితే ఆ చిత్రానికి ఆదిత్యబాబు(జగడం నిర్మాత),బోగవల్లి ప్రసాద్(ఛత్రపతి నిర్మాత) ప్రొడ్యూసర్స్. ఇద్దరూ కూడా సుకుమార్ ఇచ్చే ట్విస్ట్ లకు కమిటయినందుకు కిమ్మనకుండా ఉంటున్నారని తెలుస్తోంది. క్వాలిటీ పేరుతో రోజుకు ఒకటో రెండు షాట్స్ తీయటం,ఆర్టిస్టులందరినీ ఖాళీగా ఉంచటం సుకుమార్ చేస్తున్నాడని చెప్తున్నారు.

    దాంతో బడ్జెట్ తడిసి మోపెడు అవుతోందని నిర్మాతలు మింగలేక కక్కలేక ఉంటున్నారని అనుకుంటున్నారు. ఇక మొన్న అన్నపూర్ణాలో వేసిన సాఫ్ట్ వేర్ సెట్ మొదట పది లక్షలు బడ్జెట్ తో ప్లాన్ చేసారు. అయితే పూర్తయ్యేసరికి ఇరవై ఏడు లక్షలు అయింది. పోన్లే అనుకుంటే సుకుమార్ దాన్ని సందర్శించి పలు మార్పులు చెప్పి యాభై లక్షలకు పెంచాడు. ఇలా ప్రతీ విషయంలోనూ డబ్బుని లెక్క చేయకపోవటంతో నిర్మాతలు ఏదన్నా అందామన్నా డైరక్టర్ మూడ్ డిస్ట్రబ్ అవుతుందనీ అతను అసలే సెన్సిటివ్ అనీ ఆగుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X