Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
20ఏళ్ళ తరువాత ఉదయ్ కిరణ్ సినిమాకు సీక్వెల్.. మళ్ళీ అలాంటి హీరో దొరుకుతాడా?
ప్రేమ కథలతో 15 ఏళ్ళ క్రితం సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుందని అప్పట్లో అగ్ర దర్శకులు కూడా పొగిడారు. ఆయితే ప్రస్తుతం మాత్రం ఆయన గతంలో మాదిరిగా హిట్స్ అయితే అందుకోవడం లేదు. అయితే తన కెరీర్ మొదట్లో ఉదయ్ కిరణ్ తో కొంచెం ఎక్కువగా సినిమాలు చేసిన తేజ ఇప్పుడు అతనికి సంబంధించిన సినిమాకు సీక్వెల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్
దర్శకుడు తేజ మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక డైరెక్షన్ కంటే ముందు కెమెరామెన్ గా వర్క్ చేసిన తేజ రెమ్యునరేషన్ డైరెక్షన్ లోనే ఎక్కువగా ఉందని దర్శకుడు అవ్వాలని 2000వ సంవత్సరంలో డిసైడ్ అయ్యాడు. చిత్రం, జయం, నువ్వు నేను సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి.
తక్కువ బడ్జెట్.. ఎక్కువ లాభాలు
ఉషా కిరణ్ మూవీస్ లో రామోజీరావ్ నిర్మాతగా మొదటి సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఆ మొదటి సినిమా మరేదో కాదు. ఉదయ్ కిరణ్ ని నటుడిగా పరిచయం చేసిన చిత్రం సినిమా. రీమా సేన్ హీరోయిన్ గా నటించిన ఆ రొమాంటిక్ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. రామోజీ రావ్ ఇచ్చిన 40లక్షల్లోనే చిత్రం సినిమాను పూర్తి చేసిన తేజ బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో లాభాలను అందించాడు.
చిత్రం సినిమాకు స్క్రిప్ట్ రెడీ
ఇక ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్ రెడీ చేయాలని దర్శకుడు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదయ్ కిరణ్ ని మైమరిపించేలా ఉండే హీరోను సెలెక్ట్ చేసుకోవడం అంటే కాస్త కష్టమే. తేజ ఎలాంటి హీరోను సెట్ చెసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తేజ అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ని రేడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఓటీటీ రిలీజ్ ?
ప్రస్తుతం తేజ గోపిచంద్ తో అలిమేలు మంగ వెంకటరమణ అనే సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే రానాతో కలిసి రాక్షసరాజ్యంలో రావణాసురుడు అనే సినిమా కూడా చేయనున్నాడు. వీటితో పాటు చిత్రం సీక్వెల్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని దర్శకుడు బలమైన ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.