Don't Miss!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- News సిట్టింగ్ ఎంపీ ప్రాణం తీసిన టిక్కెట్, మరోసారి ఎంపీ కావాలనే ఆశతో, నిద్రమాత్రలతో బెదిరించి ?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
‘మైత్రి మూవీ మేకర్స్’ పార్ట్నర్స్ విడిపోతున్నారా? అసలు ఏం జరిగింది?
శ్రీమంతుడు తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి వరుస బ్లాక్ బస్టర్లు నమోదు చేయడంతో ఈ ప్రొడక్షన్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఈ సంస్థకు ఎదురు ఉండదు అనుకుంటున్న సమయంలో సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాల రూపంలో వరుస ప్లాపుల ఎదురయ్యాయి. అయితే వచ్చేవారం విడుదలవుతున్న 'డియర్ కామ్రేడ్' మూవీతో 'మైత్రి మూవీ మేకర్స్' బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం అంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాముల మధ్య విబేధాలు
నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి(సివిఎం) అనే ముగ్గురు స్నేహితులు కలిసి 2015లో ఈ నిర్మాణ సంస్థను మొదలు పెట్టిన సంగత తెలిసిందే. అయితే ఈ ముగ్గురి మధ్య విబేధాలు వచ్చినట్లుగా తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అసలు ఏం జరిగింది?
రవి శంకర్ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటుండగా... నవీన్, మోహన్ బిజినెస్ పార్ట్నర్లుగా ఉన్నారు. అయితే రవి శంకర్ కూడా బిజినెస్ పార్టనర్గా ఉండాలనే ఆలోచనకు వచ్చారని, అయితే ఈ ప్రతిపాదనపై మోహన్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మోహన్ బయటకు వస్తున్నారా?
ఇటీవల సంస్థలో జరిగిన కొన్ని విషయాలపై కూడా మోహన్ అసంతృప్తిగా ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఆయన తన ఇద్దరు భాగస్వాములతో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. బయటకు వచ్చి సొంతగా నిర్మాణ సంస్థ పెట్టే అవకాశం ఉన్నట్లు టాక్.
మైత్రి మూవీ మేకర్స్ వరుస ప్రాజెక్టులు
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ‘డియర్ కామ్రేడ్' మూవీ జులై 26న విడుదల కాబోతోంది. దీంతో పాటు నానితో ‘గ్యాంగ్ లీడర్', సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ, రామ్ చరణ్-కొరటాల ప్రాజెక్టుతో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ‘ఉప్పెన' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది.