Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మన హీరోల విషయంలో అది చాలా కష్టం.. ఎట్టకేలకు పట్టేశారు
మన టాలీవుడ్ హీరోలకు ఓ విషయం తెగ ఇబ్బంది పెడుతోంది. యంగ్ హీరోల వరకు ఎలాంటి బాధ లేకపోయినా.. సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. వారికి సరైన జోడిన వెతికి పట్టడం దర్శక నిర్మాతలకు ఎంత కష్టమవుతుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ నలుగురి సినిమాలు తెరకెక్కుతుండగా.. వారందరికీ హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి.
కొనసాగిస్తున్న వేట
చిరు-కొరటాల మూవీకి ఎందరినో అనుకుని.. చిరవకు త్రిషను ఫిక్స్ చేశారనటి తెలుస్తోంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో రాబోతోన్న సినిమాకు ఇంకా హీరోయిన్ ఎవ్వరనేది ఫిక్స్ కాలేదు. కొన్ని నెలలుగా మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. ఏదీ వర్కౌట్ కావడం లేదు.
సెట్ అయిన కాంబో..
వెంకటేష్-శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కుతున్న నారప్ప షూటింగ్ ఇటీవలె మొదలైంది. ఈ మూవీలో కూడా వెంకీ సరైన జోడిని వెతికి పట్టడానికి చాలా సమయమే పట్టింది. ఎందరినో అనుకుని చివరకు ప్రియమణిని తీసుకున్నారు. ఇక నాగార్జున రూట్ మార్చి చేస్తోన్న చిత్రం వైల్డ్ డాగ్. ఈ మూవీలో నాగ్ పక్కన జోడికి నానా ప్రయత్నాలు చేశారు. చివరకు ఓ భామను ఫిక్స్ చేశారు.
నాగ్ పక్కన దియా మీర్జా.
హైదరాబాద్కు చెందిన దియా మీర్జా నాగార్జున సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. వైల్డ్ డాగ్ పేరుతో రూపొందుతున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. దియా మీర్జాది హైదరాబాదే అయినా ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలో తొలిసారి కనిపిస్తూ ఉంది. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ.. అక్కడే సెటిలైన దియా ఇప్పుడు టాలీవుడ్కు వస్తోంది.
Recommended Video
సీనియర్ హీరోలంతా బిజీగా..
ఒకప్పుడు ఇండస్ట్రీకి నాలుగు స్థంభాలుగా ఉన్న చిరు, బాలయ్య, నాగ్, వెంకీలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. యువ హీరోలతో పోటీగా నటిస్తూ.. ఇప్పటికీ తెరపైన హీరోయిజాన్ని పండిస్తున్నారు. రానున్న రోజుల్లో వీరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏ విధమైన రికార్డులు నెలకొల్పుతాయో చూడాలి.