Mangalavaaram: మంగళవారం మూవీలో పాయల్ రాజ్ పుత్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ వారం థియేటర్లోకి వచ్చిన సినిమాల్లో మంగళవారం ఒకటి. ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రమిది. ఇక ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు మెగా, అల్లు సపోర్టుతో ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. మంచి పాజిటివ్ బజ్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ రోల్ ను ప్రముఖ హీరోయిన్ మిస్ చేసుకుంది. ఆమె ఎవరు.. ఎందుకు మిస్ చేసుకుందో ఈ స్టోరీలో చూద్దాం.
అప్పటి వరకు సినిమాలంటే... హ్యాపీ ఎండింగ్.. హీరోయిన్ అంటే పాజిటివ్ రోల్.. ఇలా ఉండేవి. ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమా వచ్చిందో.. కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఆ సినిమాతో అజయ్ భూపతి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. బోల్డ్ కంటెంట్ ను ప్రేక్షకులకు నచ్చేలా కనెక్ట్ చేయడం అనేది సాహసంతో కూడిన పని. కానీ అజయ్ భూపతి ఆ సబ్జెక్టును కరెక్టుగా హ్యాండిల్ చేసి.. హిట్ కొట్టాడు. అంతే కాదు.. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఇక ఆ సినిమా తర్వాత మల్టీ స్టారర్ గా మహా సముద్రం తెరెక్కించాడు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమాతో ప్రేక్షుకలు ముందుకు వచ్చాడు. ఇక ఈ పేరు వినగానే ఇదేం సినిమా అనిపించింది. ఇక తనకు లక్కీ హీరోయిన్ గా కలిసి వచ్చిన భామ పాయల్ రాజ్ పుత్ ను ప్రధాన పాత్రలో పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్.

ఇక ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి బోల్డ్ కంటెంట్ తో అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ రాబోతున్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అయింది. దానికి తోడు అల్లు అర్జున్, చిరంజీవి ఈ సినిమాకు సపోర్టుగా నిలిచారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ ట్రైలర్ చూసి షాక్ అయినట్లు చెప్పుకువచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను అనుకోలేదట. మహా సముద్రం తెరకెక్కించే సమయంలోనే ఈ సినిమా కథను రాసుకున్నాడట అజయ్. అలా అప్పుడు ఈ స్టోరీని మహా సముద్రం హీరోయిన్ అతిథి రావు హైదరికి చెప్పాడ. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. అయితే మళ్లీ ఆమెను సంప్రదించలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పాయల్ అయితే కరెక్ట్ అని భావించారట అజయ్. అలా అతిథి నుంచి పాయల్ రాజ్ పుత్ కు చేరింది ఈ స్టోరీ.

మొత్తానికి ఈ సినిమా పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ తో మరో లెవెల్ కి వెళ్లింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... మంగళవారం సినిమాను అజయ్ భూపతి ఎం. సురేష్ వర్మ, స్వాతి రెడ్డితో కలిసి నిర్మించారు. సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు అజ్మల్ అమీర్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్ వద్ద దూసుకుపోతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదో.


Click it and Unblock the Notifications











