Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చిరు, రాజశేఖర్ ల మధ్య రాజీ
చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య చాలా కాలంగా సాగుతున్న యుద్దానికి విరమణ జరిగినట్లే అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇద్దరి మధ్య ఓ పెద్ద నిర్మాత మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చాడని చెప్పుకుంటున్నారు.పాలిటిక్స్ లోనూ,సినీ పరిశ్రమలోనూ శాశ్వత మిత్రులు కాని,శాశ్వత శత్రువులు గానీ ఉండరని ఈ సంఘటనతో నిరూపించినట్లు అవుతోంది.ఇక ఈ రాజీ కుదిరాకే దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నెగిటివ్ రోల్ చేయటానికి ఓకే చేసాడని చెప్తున్నారు.వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రామ్చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.