twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు, రాజశేఖర్ ల మధ్య రాజీ

    By Srikanya
    |

    చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య చాలా కాలంగా సాగుతున్న యుద్దానికి విరమణ జరిగినట్లే అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇద్దరి మధ్య ఓ పెద్ద నిర్మాత మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చాడని చెప్పుకుంటున్నారు.పాలిటిక్స్ లోనూ,సినీ పరిశ్రమలోనూ శాశ్వత మిత్రులు కాని,శాశ్వత శత్రువులు గానీ ఉండరని ఈ సంఘటనతో నిరూపించినట్లు అవుతోంది.ఇక ఈ రాజీ కుదిరాకే దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నెగిటివ్ రోల్ చేయటానికి ఓకే చేసాడని చెప్తున్నారు.వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

    ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

    English summary
    There is a speculation doing rounds on the internet that for the first time Dr Rajasekhar will be acting with Ram Charan Teja. Yes, the Raja Simham star has given a nod to share screen space with the Magadheera actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X