Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు అర్జున్ నిర్మాతకి పవన్ గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానయ్య మరో ప్రాజెక్టు ఓకే చేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన దానయ్య ఆయనతో సినిమా చేయటానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని తెలుగులో ఓ మెగా దర్శకుడు చేపట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక దానయ్య ఇప్పటికే వివి వినాయిక్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో మరో చిత్రాన్ని సైతం ప్రకటించి ఉన్నారు. ఈ చిత్రం కూడా మొదలైతే ముగ్గరు మెగా హీరోలతోనూ ఒకే సారి సినిమాలు చేస్తున్న ఘనత నిర్మాతకు దక్కుతుంది. దానయ్య గతంలో అల్లు అర్జున్ తో దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ ని, వరుడు వంటి డిజాస్టర్ ని ఇచ్చి ఉన్నారు. త్రివిక్రమ్ తో జరుగుతున్న సినిమా రొమాంటిక్ కామిడీ అని చెప్తున్నారు.
ఖలేజా అనంతరం వస్తున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అలాగే బద్రీనాధ్ సైతం భాక్సాఫీస్ వద్ద అలరించకపోవటంతో అల్లు అర్జున్ సైతం మరో హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నారు. నిర్మాత సైతం ఈ సినిమా హిట్టైతే తన వరస ఫ్లాపులనుంచి కోలుకున్నట్లు అవుతుందని భావిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పంజా విడుదల తేదీ దగ్గరపడుతూండటంతో ఆ హడావిడిలో ఉన్నారు. ఆ సినిమా అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గబ్బర్ సింగ్ పై దృష్టిపెడతారు. ఈ రెండు ప్రాజెక్టులు తర్వాత పవన్ కొత్తగా కమిటైన చిత్రం షూటింగ్ ఉంటుంది.