Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
'వినయ విధేయ రామ' నష్టాలు.. రంగంలోకి దిగిన నిర్మాత!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరెకక్కించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ ప్రారంభమైంది. రాంచరణ్ సరసన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటించారు. నెగిటివ్ టాక్ తో ఈ చిత్ర వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనితో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బయ్యర్లు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనితో చిత్ర నిర్మాత డివివి దానయ్య రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
60 కోట్లు దాటిన షేర్
వినయ విధేయ రామ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు, ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించినా రాంచరణ్ క్రేజ్, సంక్రాంతి సీజన్ తో 60 కోట్ల షేర్ వరకు నెట్టుకొచ్చింది. ప్రస్తుతం వినయ విధేయ రామ్ చిత్ర వసూళ్లు బాగా నెమ్మదించాయి. ఈ చిత్రానికి 92 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీనితో బయ్యర్లు దాదాపు 25 కోట్ల వరకు నష్టపోతారనే అంచనాలు వినిపిస్తున్నాయి.
భారీ అంచనాలతో
రంగస్థలం చిత్రం సాధించిన విజయం, రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ పై ఏర్పడే అంచనాలతో బయ్యర్లు అన్ని ఏరియాలలో భారీ మొత్తం వెచ్చించి వినయ విధేయ రామ హక్కులు సొంతం చేసుకున్నారు. సినిమా హిట్ అయి ఉంటే పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఈ చిత్రం నిరాశపరచడంతో సీడెడ్, గుంటూరు లాంటి ప్రాంతాల్లో తప్ప మిగిలిన ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తంలో నష్టాలని ఎదుర్కొంటున్నారు.
ఓవర్సీస్లో పరిస్థితి
ఓవర్సీస్ లో బోయపాటి చిత్రాలకు సరైన మార్కెట్ లేదు. కానీ ఈ చిత్ర హక్కులు అక్కడ భారీ ధరకు అమ్ముడయ్యాయి. వినయ విధేయ రామ వసూళ్లు ఓవర్సీస్ లో మరీ దారుణంగా ఉన్నాయి. దీనితో నిర్మాత డివివి దానయ్య రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు 50 లక్షల వరకు తిరిగి ఇచ్చేయనున్నారట. అలాగే మిగిలిన ప్రాంతాల బయ్యర్లని కూడా ఆదుకునేందుకు దానయ్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
'వినయ విధేయ రామ' తాజా వసూళ్లు.. నష్టం లెక్క తేలిందా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే!
మాస్ ఫార్ములా
బోయపాటి శ్రీను ఎప్పటిలాగే తన మాస్ ఫార్ములాతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ ఈ చిత్రంతో మ్యాజిక్ చేయలేకపోయారు. భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్ ఇలా ఎన్ని కమర్షియల్ ట్రిక్కులు ఉపయోగించినా వర్కౌట్ కాలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. బోయపాటి శ్రీను తదుపరి చిత్రం బాలయ్యతో ఉండబోతోంది. రాంచరణ్ డివివి దానయ్య నిర్మాణంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.