Don't Miss!
- Finance FPI: మారిషస్ నుంచి పెట్టుబడులు.. పన్ను మినహాయింపు ఉంటుందా..!
- Lifestyle 30ఏళ్ల తర్వాత ఈ రక్త పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది, మీ లైఫ్ సేవ్ అవుతుంది
- News Lokniti-CSDS Pre-Poll survey 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆధిక్యంలో ఎవరు ? కారణాలేంటి ?
- Travel సమ్మర్లో ఆంధ్రాలోని ఈ ప్రదేశాలను చుట్టేయాల్సిందే..?!
- Technology రియల్మి P సిరీస్ స్మార్ట్ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ ఆఫర్లు.. ఆ రెండు గంటల్లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే..!
- Sports టేబుల్ లాస్ట్లో RCB.. ప్లేఆఫ్స్కు ఛాన్స్ ఉందా?
- Automobiles ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలో మహిళ రికార్డు.. ఏకంగా 270 చలాన్లు, పోలీసులు షాక్.!!
The Dirty Picture 2: సిల్క్ స్మితా జీవితంలో మరో కోణం.. విద్యా బాలన్ రిజెక్ట్.. మరో హీరోయిన్ ఫిక్స్?
సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ది డర్టీ పిక్చర్ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాపై ఎన్నో రకాల వివాదాలు క్రియేట్ అయిన కూడా నిర్మాత ఏక్తా కపూర్ భారీ స్థాయిలోనే ఆ సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. ఇక అనుకున్నట్లుగానే సినిమాను 2011లో విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ కూడా అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏక్తాకపూర్ ఆ సినిమాకు సీక్వెల్ ను కూడా తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అప్పట్లోనే ఈ సినిమా సెకండ్ పార్ట్ ను కూడా చాలా తొందరగానే విడుదల చేయబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వివిధ కారణాల వలన అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ధైర్యం చేయలేకపోయారు అని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తానికి ఏక్తా కపూర్ మళ్లీ ది డర్టీ పిక్చర్ కు సీక్వెల్ ను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే సిల్క్ స్మిత జీవితంలో మరేదైనా కొత్తకోనాన్ని చూపిస్తారా లేదంటే మరొకరి జీవితాన్ని తెరపైకి తీసుకువస్తారా అనేది చూడాలి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు సీక్వెల్ పై ఆలోచించినప్పుడు మరోసారి విద్యా బాలన్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారట. అయితే ఆ పాయింట్ మాత్రం ఆమెకు ఏమాత్రం నచ్చలేదట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రౌనత్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఈ ప్రాజెక్టులో నటించడానికి కొంతమంది గ్లామరస్ హీరోయిన్స్ కూడా ఆసక్తిని చూపించారట. కానీ కంగనా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏక్తా కపూర్ కి మరొకరి అవసరం పడలేదు అని తెలుస్తోంది. ఏదేమైనా కూడా సంచలనాత్మకమైన సినిమాకు ఏక్తాకపూర్ మరోసారి ప్రణాళికలు రచించినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.