twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈటీవీ సుమన్ సరి కొత్త ఛానెల్?

    By Staff
    |

    Suman
    ఓ ప్రక్క సాక్షి పేపరులో రామోజి రామాయణం అంటూ వార్తా కథనం వెలవడి అంతటా హాట్ టాపిక్ గా మారితే మరో ప్రక్క సుమన్ త్వరలోనే ఓ కొత్త ఛానెల్ ను ప్రారంభించబోతున్నాడనే వార్తలు అంతటా గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని ఈటీవి ప్రభాకర్ ఓ ప్రెవేట్ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఈ ఉదయం(శుక్రవారం) కన్ఫర్మ్ చసి మరీ చెప్పాడు.

    సుమన్ కి తెలిసింది రాసుకోవటం, ఛానెల్ నడపటం మాత్రమే కాబట్టి ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ పెడతారని చెప్పుకొచ్చాడు. అలాగే సాక్షి ఇంటర్వూ లోనూ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అంటే...సుమన్ నవ్వుతూ మంచి పోగ్రామ్స్ సడెన్ గా ఎండ్ అయ్యాయని ఫీల్ అయిన ప్రేక్షకులందరికీ న్యాయం చేస్తాం,ఏదో ఒక రూపంలో ఎండింగ్ ఇస్తాం. వాళ్ళని సంతోష పెడతాం అని చెప్పారు. దాన్ని బట్టి సుమన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

    అయితే మరి ఛానెల్ పెట్టటానికి కావల్సిన భారీ పెట్టబడి ఎవరు పెడతారు అంటే ఈ సెన్సేషన్ ఐటం ఉన్న సాక్షి యాజమాన్యమే అని తెలుస్తోంది. వారే ఈ అస్త్రాన్ని తమకు తండ్రిని ఎదిరించి మరీ ఇచ్చినందుకు ఛానెల్ పెట్టుకునేందుకు ఓ పెట్టుబడి ప్యాకేజ్ ఇచ్చారని వినపడుతోంది. ఆ ఛానెల్ కి ఎస్.ఛానెల్ అని నామకరణం చేస్తారని సమాచారం. అలాగే ప్రభాకర్ ఈ ఎంటర్ టైన్ మెంట్ కి తన అనుభవ సారాన్ని ధారపోస్తారని చెప్తున్నారు.

    అయితే జనవరిలో రానున్న సాక్షి ఛానెల్ కి ఇది అనుభంధంగా ఉంటుందా అనేది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి రామోజీతో రాజశేఖరుడు యుధ్ధంలో ఓ పెద్ద అస్త్రం వినియేగించారు. అయితే ఈ అస్త్రం రామేజికే ప్లస్ అవుతుందనే వాళ్ళూ ఉన్నారు. ఆయనకు అయ్యో ముద్దుగా సాకిన కొడుకు ఇట్టా చేసాడా అనే సానుభూతి వచ్చిందంటున్నారు. అవన్నీ అలా ఉంచితే శ్రీహరి స్వరాలు వంటి అంతరంగాలు వంటి పోగ్రామ్స్ ఇక ఎస్.ఛానెల్ లో చూస్తామన్నమాట. రెడీగా ఉండాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X