twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ టీవీ సుమన్ కు నిజంగానే బుద్ది వచ్చిందా..

    By Srikanya
    |

    ఈటీవి సుమన్ తన టీవీ సీరియల్స్ కు పాటలు రాసి వాటి ఆడియో రిలీజ్ చేసి హంగామా చేస్తూండటం ఆనవాయితీ. అయితే ఆయన తాజాగా నిర్మిస్తున్న నాన్ స్టాఫ్ అనే చిత్రంలో ఒక్క పాట కూడా రాయలేదు. ఈ విషయాన్నే మీడియా ఆయన వద్ద ఆశ్చర్యపోతూ ప్రస్తావించింది. దానికి ఆయన చాలా గంభీరంగా...ఇలా చెప్పుకొచ్చారు. ఆ చిత్ర దర్శకుడునన్ను రాయమని అడగలేదు. నేను రాయాల్సిన అవసరం కూడా రాలేదు. నా సినిమాల్లో ప్రతిదీ నేనే చేయాలనుకుంటే చేయొచ్చు. మంచి కథ సిద్ధం చేసుకుని, మాటలు రాసుకుని దర్శకత్వం చేయొచ్చు. కానీ అవి చేయడానికి ఇతరులు ఉన్నప్పుడు.. నేను నిర్మాతగా ఉండటానికే ఇష్టపడతాను. నేను చేయదగ్గవి, నేను మాత్రమే చేయగలను అనిపించినవాటిని నేను చేస్తాను. ఈ సినిమాకు నేను నిర్మాతని. నిర్మాతగా నా సినిమా ఎలా ఉంటే బాగుంటుందనుకున్నానో 'నాన్‌స్టాప్‌' అలాగే ఉంటుంది అన్నారు. అయితే అసలు కారణం వేరే ఉందని సమాచారం. ఆయన పాటలు రాయటానికి ముందుకొస్తే దర్శకుడు వెనక్కి తగ్గాడని తెలుస్తోంది. కొన్నివిషయాల్లో స్వేచ్చ ఇస్తేనే సినిమా పూర్తి చేస్తానని ఖరాఖండిగా చెప్పారని, తప్పని స్ధితిలో ఇలా తన రచనా కుతూహలాలన్ని అణుచుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇది తెలియని కొందరు ఈటీవి సుమన్ కు గతంలో జరిగిన అనుభవాలు గుర్తు చేసుకుని ఈసారి ఇలా అన్ని విషయాల్లో వేలు పెట్టకుండా బుద్దిగా ఉన్నాడని అనుకుంటున్నారు. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X