Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Evaru Meelo Koteswarulu Leaks: దుమ్ము దులిపేసిన మహేష్.. ఎన్ని లక్షలు గెలిచారంటే.. ?
తెలుగు టెలివిజన్ లో కౌన్ బనేగా కరోడ్పతికి తెలుగు రూపం 'మీలో ఎవరు కోటీశ్వరుడు షో'ను ఇటీవలే ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో ప్రారంభమై తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గత మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ షోకు మంచి ఆదరణ మాత్రమే కాకుండా టీఆర్పీ కూడా దక్కుతుంది.
అయితే ఈ షోతో పాటు పోటాపోటీగా బిగ్ బాస్ కూడా ఉండడంతో ఎక్కువగా సెలబ్రిటీ గెస్టులను తీసుకొచ్చి షో చేయించడానికి చూస్తున్నారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మహేష్ బాబు పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఆయన ఎంత గెలుచుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
మొదటి ఎపిసోడ్ తోనే
టెలివిజన్ షోలు చేయడంలో మంచి అనుభవం సంపాదించిన ఎన్టీఆర్ ఈ షోను తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా నిన్న టెలికాస్ట్ అయినా ఎపిసోడ్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ ముఖ్య అతిథులుగా వచ్చారు. నిజానికి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కర్టెన్ రైజర్ తోనే అదరగొట్టాడు. తన స్నేహితుడు, ఆర్ ఆర్ ఆర్ కో స్టార్ మెగా పవర్ స్టార్ రాంచరణ్తో చేసిన మొదటి ఎపిసోడ్ మోస్ట్ టీఆర్పీ సాధించిన ఎపిసోడ్గా సాగింది.
సెలబ్రిటీ స్పెషల్
దీంతో సెలబ్రిటీలను ఈ షోకు తీసుకురావాలనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్టీఆర్ కెరీర్ లో మంచి హిట్ సినిమాలు ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి కాగా, కొరటాల శివలు ఒక ఎపిసోడ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. తాజా ప్రచారం మేరకు ఈ షోకి ముఖ్య అతిథిగా మహేష్ బాబు హాజరైనట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా నిన్న జరిగిందని అంటున్నారు.
ఎంత గెలుచుకున్నారంటె
ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ షోలో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకోగా, ఆ గెలుచుకున్న పాతిక లక్షలు ఛారిటీకి దానం చేసినట్లు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ అయితే దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మంచి బాండ్
ఎన్టీఆర్, మహేష్ మధ్య మంచి బాండ్ ఉంది, వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మహేష్ ని అన్నా అని పిలుస్తారు. ఆ అనుబంధం కారణంగానే మహేష్ బాబు భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మహేష్ బాబు ఈ షోకు వస్తుండడం విశేషం.
Recommended Video
ఇన్నేళ్ళ తర్వాత
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మహేష్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు వేదిక ద్వారా కలిసి కనిపించనున్నారని అంటున్నారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పాల్గొనే ఈ ఎపిసోడ్ టీఆర్పీ ఒక రేంజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు. చూడాలిఎన్టీఆర్ - మహేష్ కలిసి చేసిన ఈ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో.