Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అజ్ఝాతంలోనికి వెళ్ళిపోయిన ‘ఇంకోసారి’ హీరో
'ఆనంద్" సాధించిన అనూహ్య విజయాన్ని ఆసరా చేసుకుని అనాసాయంగా ఇప్పటికి ఓ ఇరవై సినిమాల్లో నటించేసి ఆ ఇరవై చిత్రాల నిర్మాతలను నిట్ట నిలువునా నట్టేట్లో ముంచేసిన రాజా..గత ఆరు నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు. తను నటించిన 'ఇంకోసారి" చిత్రాన్ని ప్రేక్షకులు చూడకుండా అడ్డుపడుతున్నారంటూ పరిశ్రమలోని కొందరు పెద్దలపై పేర్లు పెట్టి మరీ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆతర్వాత కొద్ది రోజలకు సూసైడ్ అటెంప్ట్ చేశాడని వర్తాలు వచ్చాయి. అయితే వాటి ద్వారా ఏమి సాధించలేక పవడంతో రాజా ఆ తర్వాత నుంచి అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడు. రాజా నటిస్తున్న చిత్రం కూడా ప్రస్తుతం ఏదీ ఉన్నట్లు లేదు.
'ఆనంద్" చిత్రంతో రాజాకు..రాజాలాంటి లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల అతనికి మళ్లీ ఏదైనా అవకాశమిస్తాడా అంటె అటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే 'ఆనంద్" సినిమా విడుదలయ్యేసరికే రాజాకు శేఖర్ తో చెడిపోయింది. 'ఆనంద్" తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రాల వేడుకల్లో రాజా కాని, రాజా నటించిన చిత్రాలకు సంబంధించిన ఫంక్షన్లలో శేఖర్ కమ్ముల కాని ఎప్పుడూ కనిపించకపోవడమే ఇందుకు ఉదాహరణ.