Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అజ్ఝాతంలోనికి వెళ్ళిపోయిన ‘ఇంకోసారి’ హీరో
'ఆనంద్" సాధించిన అనూహ్య విజయాన్ని ఆసరా చేసుకుని అనాసాయంగా ఇప్పటికి ఓ ఇరవై సినిమాల్లో నటించేసి ఆ ఇరవై చిత్రాల నిర్మాతలను నిట్ట నిలువునా నట్టేట్లో ముంచేసిన రాజా..గత ఆరు నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు. తను నటించిన 'ఇంకోసారి" చిత్రాన్ని ప్రేక్షకులు చూడకుండా అడ్డుపడుతున్నారంటూ పరిశ్రమలోని కొందరు పెద్దలపై పేర్లు పెట్టి మరీ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆతర్వాత కొద్ది రోజలకు సూసైడ్ అటెంప్ట్ చేశాడని వర్తాలు వచ్చాయి. అయితే వాటి ద్వారా ఏమి సాధించలేక పవడంతో రాజా ఆ తర్వాత నుంచి అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడు. రాజా నటిస్తున్న చిత్రం కూడా ప్రస్తుతం ఏదీ ఉన్నట్లు లేదు.
'ఆనంద్" చిత్రంతో రాజాకు..రాజాలాంటి లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల అతనికి మళ్లీ ఏదైనా అవకాశమిస్తాడా అంటె అటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే 'ఆనంద్" సినిమా విడుదలయ్యేసరికే రాజాకు శేఖర్ తో చెడిపోయింది. 'ఆనంద్" తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రాల వేడుకల్లో రాజా కాని, రాజా నటించిన చిత్రాలకు సంబంధించిన ఫంక్షన్లలో శేఖర్ కమ్ముల కాని ఎప్పుడూ కనిపించకపోవడమే ఇందుకు ఉదాహరణ.