Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అజ్ఝాతంలోనికి వెళ్ళిపోయిన ‘ఇంకోసారి’ హీరో
'ఆనంద్" సాధించిన అనూహ్య విజయాన్ని ఆసరా చేసుకుని అనాసాయంగా ఇప్పటికి ఓ ఇరవై సినిమాల్లో నటించేసి ఆ ఇరవై చిత్రాల నిర్మాతలను నిట్ట నిలువునా నట్టేట్లో ముంచేసిన రాజా..గత ఆరు నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు. తను నటించిన 'ఇంకోసారి" చిత్రాన్ని ప్రేక్షకులు చూడకుండా అడ్డుపడుతున్నారంటూ పరిశ్రమలోని కొందరు పెద్దలపై పేర్లు పెట్టి మరీ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆతర్వాత కొద్ది రోజలకు సూసైడ్ అటెంప్ట్ చేశాడని వర్తాలు వచ్చాయి. అయితే వాటి ద్వారా ఏమి సాధించలేక పవడంతో రాజా ఆ తర్వాత నుంచి అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడు. రాజా నటిస్తున్న చిత్రం కూడా ప్రస్తుతం ఏదీ ఉన్నట్లు లేదు.
'ఆనంద్" చిత్రంతో రాజాకు..రాజాలాంటి లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల అతనికి మళ్లీ ఏదైనా అవకాశమిస్తాడా అంటె అటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే 'ఆనంద్" సినిమా విడుదలయ్యేసరికే రాజాకు శేఖర్ తో చెడిపోయింది. 'ఆనంద్" తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రాల వేడుకల్లో రాజా కాని, రాజా నటించిన చిత్రాలకు సంబంధించిన ఫంక్షన్లలో శేఖర్ కమ్ముల కాని ఎప్పుడూ కనిపించకపోవడమే ఇందుకు ఉదాహరణ.