Don't Miss!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
రాజమౌళి ‘బాహుబలి’ కొత్త సెట్స్ గురించి...
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం కోసం భారీగా సెట్స్ వేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'గ్లాడియేటర్' తరహాలో ఓ భారీ సెట్ను కూడా రాజవౌళి ఈ చిత్రం కోసం రూపొందించనున్నారని చెప్తున్నారు. దీంతోపాటు విలన్ గా చేస్తున్న రానా డెన్, ఉద్యానవనాలు వంటివి కూడా సెట్టింగ్స్ వేస్తున్నారట. మొత్తంమీద చాలా ఖర్చవుతుందని అంచనా. ఈ సెట్స్ లో తీసే సీన్స్ లో సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.
ఇక దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఏది చేసినా అది సెన్సేషన్గా మారుతుంది. తాజాగా ఆయన రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రంపై ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అంచనాలు పెంచడంలో ఆయనది అందెవేసిన చేయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆర్ఎఫ్సిలో ఇటీవలే సాబు శిరిల్ రూపొందించిన ఎరీనా సెట్లో రాజవౌళి రెండున్నర కోట్ల భారీ వ్యయంతో ప్రభాస్కు అనుష్కకు నిశ్చితార్థం దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో రానా, రమ్యకృష్ణలతోపాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ ఒక్క సెట్కే రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చయితే ఇక మిగతా వాటి గురించి ఏ తరహాలో ఖర్చు చేస్తారో అన్న ఆలోచన టాలీవుడ్లో చర్చ సాగుతోంది.
ఈ
చిత్రంలో
రానా
...
తండ్రిగా
కనిపించనున్నాడని
తెలుస్తోంది.
అతని
కొడుకుగా
పవన్
కళ్యాణ్
పంజా
చిత్రం
విలన్
అడవి
శేషు
కనిపిస్తారు.
ఇద్దరవీ
నెగిటివ్
రోల్సే.
అలాగే
గారాబంతో
చెడిపోయిన
కొడుకు
పాత్ర
అడవి
శేషుది
అని
తెలుస్తోంది.
ఈ
భారీ
సినిమా
గురించి
చాలా
కాలంగా
ప్రేక్షకులు
ఆసక్తికరంగా
ఎదురు
చూస్తున్న
సంగతి
తెలిసిందే.
ఈ
చిత్రంలో
ఇంకా
సత్యరాజ్,
నాజర్,
అడవి
శేషు,
సుదీప్
తదితరులు
ముఖ్య
పాత్రలు
పోషిస్తున్నారు.
ఆర్కా మీడియా బేనర్పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.