Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలతో మహేష్ బాబును సరికొత్తగా ప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మూడవసారి కూడా మరింత డిఫరెంట్ గా చూపిస్తాడాని టాక్ అయితే గట్టిగానే వస్తోంది. అయితే కొన్ని రూమర్స్ అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి. అవి అబద్ధమైతే బాగుండు అని కోరుకుంటున్నారు.
క్యాన్సిల్ అవ్వడంతో
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అనంతరం మరొక సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా సెట్స్ పైకి రాలేదు. చర్చల దశలోనే క్యాన్సిల్ అవ్వడంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో మరో కథను ఫైనల్ చేసుకున్నాడు.
ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు..
ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే 'సర్కారు వారి పాట' టీమ్ లో ఒకరికి కరోనా రావడంతో అందరూ కూడా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
ఇంతకంటే ఎక్కువ ప్రయోగాలు చేయలేడా
ఇక త్రివిక్రమ్ ఎంచుకున్న కథపై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఎప్పటిలానే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సెలెక్ట్ చేసుకొని అందులో కాస్త యాక్షన్ ను చూపించబోతున్నాడట. ఈ టాక్ రావడంతో ఓ వర్గం అభిమానులు త్రివిక్రమ్ ఇంతకంటే ఎక్కువ ప్రయోగాలు చేయలేడా అని కామెంట్స్ చేస్తున్నారు.హీరోయిన్ విషయంలో కూడా ఓ వర్గం అభిమానులు ముందే కంగారు పడుతున్నారు.
Recommended Video
హీరోయిన్ విషయంలో
ఈసారి కూడా త్రివిక్రమ్ పూజ హెగ్డేను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. అరవింద సమేత, అల.. వైకుంఠపురములో సినిమాలకు వరుసగా ఆమెనే సెలెక్ట్ చేసుకున్న మాటల మాంత్రికుడు మరోసారి మళ్ళీ ఈ హాట్ బ్యూటీనే సెలెక్ట్ చేసుకోవడం రొటీన్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇదివరకే మహేష్ బాబుతో పూజ మహర్షి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆమెను కాకుండా మరొకరిని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.