Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జిల్లాకలెక్టర్ వరకూ వెళ్ళిన చిరు-పవన్ ఫ్యాన్స్ 'పంజా’రగడ...?
పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని అయినా రిలీజ్ కావచ్చు. రిలీజ్ అయిన వాటిలో ఎన్నయినా ఫ్లాప్ కావచ్చు. అయినా సరే పవన్ ఇమేజ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. పులి, తీన్ మార్ లాంటి ఫ్లాప్ సినిమాలు తరువాత రిలీజ్ అవుతున్నా పంజాకు అంతకు ముందు సినిమాల కంటే క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ చరిష్మా అలాంటిది.
'పంజా' సిన్మా ఆడియో పంక్షన్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు. మెగా ఫ్యామిలీలో విభేధాల్ని బయటపెట్టాయి. అంతా దీన్ని మర్చిపోక ముందే.. మరో రగడ మొదలైంది. ఈసారి ఇది ఫ్యాన్స్ మధ్య కావడం విశేషం. సిన్మా విడుదల సందర్భంగా చిరు, పవన్ అభిమాన సంఘాల చిచ్చు రేగడం... నెల్లూరులో సంచలనమైంది. పవన్ కళ్యాణ్ సిన్మా అంటే చాలు ఫ్యాన్స్కి పండగే. ఒక్క పవర్ స్టార్ అభిమానులకే కాదు.. మొత్తం మెగా అభిమానులందరికీ కూడా పండగే.
ఒక్క పవర్ స్టార్ అభిమానులకే కాదు.. మొత్తం మెగా అభిమానులందరికీ కూడా పండగే. ఇప్పటి వరకూ అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపించినా ఇప్పుడిప్పుడే ఈ అభిమాన సంఘాల మధ్యా విభేదాలు పొడసూపుతున్నాయి. తాజాగా పంజా టికెట్ల విషయంలో నెల్లూరులో చిరు, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. తొలిరోజు ఎక్కువ టికెట్లు దక్కించుకోవడానికి రెండు వర్గాలూ ఎవరికి వారు ప్రయత్నాలు చేసారు.
ఐతే, చిరు యువత పేరుతో కొందరు టికెట్లు సొంతం చేసుకుని నిజమైన అభిమానులకు ద్రోహం చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మద్య గొడవ కాస్తా జిల్లా కలెక్టర్ వరకూ వెళ్లింది. ఇదంతా చూసిన ఆయన.. ఇకపై ఫ్యాన్స్కి ముందస్తు టికెట్లు ఇవ్వడం మానేయాలని సూచించారు.