Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ మ్యాటర్ లో బెల్లంకొండ సురేష్ కీ ప్రియమణికీ చెడిందా?
బెల్లంకొండ బ్యానర్ లో వరసగా శంభో శివ శంభో, గోలీమార్ చిత్రాలు చేసిన ప్రియమణి అది తన సొంత బ్యానర్ లాంటిదని స్టేట్ మెంట్ లు ఇచ్చింది. అయితే ఇప్పుడు బెల్లంకొండ తనకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టాడని గోలెడుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న దాని ప్రకారం ప్రియమణికీ బెల్లంకొండ మధ్య రెమ్యునేషన్ నిమిత్తం ఓ ఎగ్రిమెంట్ జరిగి మూడు సినిమాలు దాకా అదే రేటుకు కంటెన్యూ అవుతానని ఫిక్స్ అయింది. అయితే బెల్లంకొండ అనుకున్న ప్రకారం ఆ డబ్బుచెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నాడని వాపోతోందిట ప్రియమణి. అయితే ఆ రెండు సినిమాల వల్ల తనకు మిగిలిందేమీ లేదని, హీరోయన్ గా ఆ సినిమాలకు కలిసి రాలేదని, ఇచ్చిందే ఎక్కువ అని బెల్లంకొండ తెగేసి చెప్తున్నాడని అంటున్నారు. తెలుగులో ఖాళీగా ఉన్నప్పుడు రెండు సినిమాలు ఇచ్చి బిజీ చేయటమే గొప్పని చెప్తున్నాడని ఆమె భాధపడుతూ చెప్పుకుంటోందిట. ఇక ప్రియమణి తను ప్రస్తుతం రక్త చరిత్ర, రావణ్ లతో పెద్ద డైరక్టర్స్ సినిమా చేసి కెరీర్ లో ముందుకు వెళ్థున్నానని ఇటువంటి టైమ్ లో ఇలాంటి మాటలు వినటం కష్టమేనంటోందిట.