గబ్బర్ సింగ్-2...డైరెక్టర్ మళ్లీ మార్పు?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' మూవీ ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండేళ్లుగా ఈ చిత్రం ప్రారంభానికి నోచుకోకుండా ఊగిసలాడుతూనే ఉంది. సంపత్ నంది దర్శకుడిగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. పలు కారణాలతో సినిమా ప్రారంభం కాకముందే సంపత్ నంది ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చారు. సంపత్ నంది స్టోరీ, స్క్రిప్టు వర్కు నచ్చకనే ఆయన్ను తీసేసినట్లు టాక్. దీంతో అదే స్టోరీతో సంపత్ నంది రవితేజతో ‘బెంగాల్ టైగార్' ప్లాన్ చేసుకున్నాడు.
తర్వాత ‘పవర్' ఫేం బాబీ గబ్బర్ సింగ్ 2 చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు. పవన్ కళ్యాణే స్వయంగా స్టోరీ సమకూర్చారు. స్క్రిప్టు వర్కు మాత్రం బాబీకి అప్పగించాడు. అయితే బాబీ కూడా పవన్ కళ్యాణ్ని మెప్పించలేక పోయాడని టాక్. దీంతో బాబీ కూడా ఈ ప్రాజెక్టు నుండి ఔట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఖాళీ గ్యాపులో దాసరి నారాయణరావు నిర్మాణ సంస్థలో సినిమా చేయాలని పవర్ స్టార్ ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
ఇదీ కాక...పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ స్థాపించిన న్యూ టాలెంటును ఎంకరేజ్ చేయాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ ఆచరణలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కింద వరుసగా యువ హీరోలు, దర్శకులతో ఆయన సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నారట. ఏమిటో ఈ పరిణామాలన్నీ అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











